Akhil Akkineni: ఈ సినిమా తర్వాత నా పరిస్థితి ఏంటో అని భయం వేస్తుంది..’ఏజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ షాకింగ్ కామెంట్స్

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వరంగల్ లో ఘనంగా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు అన్నీ అడ్డంకులను దాటుకొని ఈ నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది.’సై రా నరసింహా రెడ్డి’ సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం […]

Written By: Vicky, Updated On : April 24, 2023 7:21 am
Follow us on

Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వరంగల్ లో ఘనంగా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు అన్నీ అడ్డంకులను దాటుకొని ఈ నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది.’సై రా నరసింహా రెడ్డి’ సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఇది.

ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అక్కినేని అఖిల్ ని చాలా స్టైలిష్ గా మరియు వైల్డ్ గా చూపించాడు సురేందర్ రెడ్డి. కచ్చితంగా థియేటర్ లో చూసే ఆడియన్స్ మరియు ప్రేక్షకులకు కూడా వైల్డ్ అనుభూతి కలుగుతుంది అనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

Akhil Akkineni

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అక్కినేని అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముందుగా ఈ సభకి అతిథులుగా విచ్చేసిన అందరికి కృతఙ్ఞతలు తెలియచేస్తూ అఖిల్ ప్రసంగం ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతూ ‘సురేందర్ రెడ్డి గారు, మన ఇద్దరం కలిసినప్పుడు క్రేజీ గా ఎదో ఒకటి చేద్దాం అని అనుకున్నాము.అనుకున్నట్టు గానే ఎదో చేసాము సార్, ఈ సినిమా తర్వాత నేను తర్వాత ఏమైపోతానో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో నన్ను చూపించేసారు,దీనికి మించి నేను ఏమి చెయ్యగలను అని అనిపిస్తుంది. ఇక నేను ప్రత్యేకించి థాంక్స్ చెప్పుకోవాల్సింది మమ్మూటీ గారికి. అలాంటి లెజెండ్ తో కలిసి నటించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.ఆయన మామూలుగా ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ చెయ్యడానికి ఒప్పుకోరు, కానీ ఈ కథని ని నచ్చి వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను సార్’ అంటూ అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.