spot_img
Homeట్రెండింగ్ న్యూస్Biryani: లొట్టలేసుకుంటూ తిన్నారు.. ఈ ఏడాది హైదరాబాదీలు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ చేశారో తెలుసా?

Biryani: లొట్టలేసుకుంటూ తిన్నారు.. ఈ ఏడాది హైదరాబాదీలు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ చేశారో తెలుసా?

Biryani: తొమ్మిదో ఏడాది కూడా ఆన్ లైన్ ఆర్డర్లలో కూడా బిర్యానీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.. స్విగ్గి చెప్పిన లెక్కల ప్రకారం 2024 జనవరి 1 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 8.3 కోట్ల బిర్యానీలను హైదరాబాద్ ప్రజలు ఆర్డర్ చేశారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి నిమిషానికి 158 బిర్యానీలను కొనుగోలు చేశారు. సెకను కు రెండు బిర్యానీల చొప్పున ఆర్డర్ చేశారు. బిర్యానీ తర్వాత 2.3 కోట్ల ఆర్డర్లతో దోస నిలిచింది.. ఈ ఏడాది 4.9 లక్షల చికెన్ బిర్యానీలు ఆర్డర్లు అదనంగా వచ్చాయని స్విగ్గి ప్రకటించింది. హైదరాబాద్ ప్రజలు 97 లక్షలకు పైగా చికెన్ బిర్యాని లను ఆర్డర్ చేశారట. బెంగళూరు ప్రజలు 77 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి రెండవ స్థానంలో నిలిచారు. చెన్నై ప్రజలు 46 లక్షల బిర్యానీలను హార్నర్ చేసి మూడో స్థానంలో నిలిచారు. స్విగ్గి లెక్కల ప్రకారం మెట్రో నగరాలలో ఉంటున్న ప్రజలు. చికెన్ బర్గర్ ఎక్కువగా తింటున్నారు. రాత్రి 12 నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు చికెన్ బర్గర్ ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. 18.4 లక్షల చికెన్ బర్గర్లను మెట్రో నగరాల ప్రజలు ఆర్డర్ చేశారని స్విగ్గి తన వార్షిక నివేదికలో పేర్కొంది.

మసాలా దోశ ఫేమస్

ఇక దోశ విషయంలో మసాలా దోశ సరికొత్త రికార్డులను సృష్టించింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరవాసులు జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 25 లక్షల మసాలా దోశలను ఆర్డర్ చేశారు. ఢిల్లీ, చండీగఢ్, కోల్ కతా ప్రాంతాల ప్రజలు చోలే, ఆలు పరాటా, కచోరీలను ఎక్కువగా ఆర్డర్ చేశారు.. బెంగళూరు నగరంలోని ఓ వ్యక్తి ఏడాది మొత్తం పాస్తా కోసం దాదాపు 50 వేల వరకు ఖర్చు చేశాడు.. ఇతడు స్విగ్గి యూజర్ గా ఉన్నాడు. పెటుక్సిన్ ఆల్ ఫ్రెడో -55, చీజ్ మాక్ -40, స్ప ఘెట్టి 30 లను ఆర్డర్ చేశాడు. ఇక ఏడాది భోజనం కంటే రాత్రిపూట డిన్నర్ కోసమే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్డర్లు 29% పెరిగాయి. డిన్నర్లకు సంబంధించి మొత్తం 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ప్రకటించింది. అత్యంత ఎక్కువమంది ఇష్టపడిన స్నాక్ ఐటమ్ గా చికెన్ రోల్ నిలిచింది. 24.8 లక్షలమంది చికెన్ రోల్ ను ఆర్డర్ చేశారు. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. పొటాటో ప్రైస్ 13 లక్షల ఆర్డర్లతో మూడో స్థానంలో ఉన్నాయి. కస్టమర్లు కోరుకున్న ఆహార పదార్థాలను రవాణా చేయడానికి స్విగ్గి డెలివరీ బాయ్స్ మొత్తం 1.96 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షల సార్లు ప్రయాణించడంతో సమానం అని స్విగ్గి చెబుతోంది. స్విగ్గిలో 10,703 ఆర్డర్లను సర్వ్ చేసి, ముంబై నగరానికి చెందిన కపిల్ కుమార్ పాండే హైయెస్ట్ డెలివరీ బాయ్ గా పేరుపొందాడు. కాళేశ్వరి అనే కోయంబత్తూర్ మహిళ 6,658 ఆర్డర్లను అందించి రెండవ స్థానంలో నిలిచింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper