Homeట్రెండింగ్ న్యూస్Anand Mahindra: భయాన్ని చూసి భయపడకండి.. ధైర్యంగా ఇలా ఎదుర్కోండి.. వైరల్ వీడియో

Anand Mahindra: భయాన్ని చూసి భయపడకండి.. ధైర్యంగా ఇలా ఎదుర్కోండి.. వైరల్ వీడియో

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. కార్పొరేట్ ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు. రెండు చక్రాల వాహనాల నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఆయన సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తయారుచేయని ఉత్పత్తి అంటూ లేదు. వేలకోట్ల వ్యాపారాలకు అధిపతి ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటారు. తనకు తెలిసిన విషయాలను పంచుకుంటారు. తెలియని విషయాలను కూడా తెలుసుకుంటారు. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల గురించి కూడా పరిచయం చేస్తూ ఉంటారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని గురించి కూడా పొగుడుతుంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు.. ఊపిరి సలపని పని ఒత్తిడిలోనూ ఆయన సోషల్ మీడియాకు సమయం కేటాయిస్తారు. మరీ ముఖ్యంగా ట్విట్టర్లో ఆయన అత్యంత చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు తెలిసిన విషయాలను ట్విట్టర్లో ట్విట్ చేసే ఆయన.. భయం గురించి, దాని నుంచి నేర్చుకోవాల్సిన ధైర్యం గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది.

ఇద్దరు వ్యక్తులు ఒకచోట నిలుచుంటారు. ఒక భారీ ఏనుగు వారి మీదకు దూసుకొస్తూ ఉంటుంది. ఆ ఇద్దరి మనుషులను తొండంతో కసితీరా నేలకు కొట్టేంత కోపంతో అది పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. కోపంతో ఉన్న ఆ ఏనుగులు చూసి ఆ ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం భయపడరు. పైగా ధైర్యంగా అలాగే నిలబడతారు. కొంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ ఏనుగు తర్వాత ఆగిపోతుంది. అప్పటిదాకా తనకు ఉన్న కోపాన్ని తగ్గించుకుని వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది.. నిమిషాని కంటే తక్కువ ఉన్న ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో ఉన్న వీడియో ద్వారా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆనంద్ చెప్పుకొచ్చారు.

చాలామంది సమస్యలు ఎదురైతే భయపడిపోతుంటారు. వై మీ అనుకుంటూ ఢీలా పడిపోతుంటారు. సమస్యలు ఎదురైనప్పుడు వై మీ అనుకోకుండా ట్రై మీ అనుకుంటే పరిష్కారం దొరుకుతుందని.. ఆనంద్ తన రాతల ద్వారా చెప్పుకొచ్చారు.. ఆ వీడియోలో ఏనుగు దూసుకొస్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే అలాగే నిలబడి ఉన్నారు.. మిగతావారి లాగా వారు కూడా పరుగు లంకించుకొని ఉంటే ఏనుగు ఇంకా వారి వెంటపడి తరిమేది. పొరపాటున దానికి దొరికి ఉంటే ప్రాణం కూడా తీసేది. కానీ వారిద్దరు ఏమాత్రం భయపడకుండా ఆ ఏనుగుకు అలాగే ఎదురొడ్డి నిలబడ్డారు. ఫలితంగా ఆ ఏనుగు వెనకడుగు వేసి వెళ్ళిపోయింది. అందుకే ఏ సమస్య వచ్చినా కూడా అలాగే నిలబడి ఉండాలని ఆనంద్ వీడియో నెటిజన్లకు చెప్పే ప్రయత్నం చేశారు. కాగా ఈ వీడియో ను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి వీడియో బతుకు పాఠం నేర్పిస్తుందని.. భయం నుంచి ధైర్యాన్ని ఎలా కూడదీసుకోవాలో వివరిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version