spot_img
Homeట్రెండింగ్ న్యూస్Nellore: చనిపోయిన వ్యక్తి దర్జాగా ఇంటికి.. అసలు విషయం తెలిసేసరికి అందరికీ షాక్

Nellore: చనిపోయిన వ్యక్తి దర్జాగా ఇంటికి.. అసలు విషయం తెలిసేసరికి అందరికీ షాక్

Nellore: సాధారణంగా కొన్ని ఘటనలు విచిత్రంగా జరుగుతాయి. అయితే వాటి పరిణామాలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. అయితే జీవితమన్నాక భయపెట్టిన ఘటనలు, ఆశ్చర్యకర పరిణామాలు సహజం. అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తే మాత్రం అది షాకే కదా. ప్రమాదంలో మృతిచెంది.. అంత్యక్రియలు పూర్తిచేసిన వ్యక్తి అలా రోడ్డుపైవస్తే చూసేవారికి మైండ్ బ్లాకే కదా. నెల్లూరు జిల్లాలో తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. చనిపోయిన వ్యక్తికి కుటుంబసభ్యులు, గ్రామస్థులు అంత్యక్రియలు చేశారు. తీరా అక్కడికి ఒక రోజుపోయే సరికి చనిపోయిన వ్యక్తి నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. తొలుత షాక్ కు గురైన గ్రామస్థులు తరువాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు మాత్రం ఆయన తిరిగొచ్చినందుకు సంతోషపడ్డారు.

Nellore
Satish

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో వింత ఘటన వెలుగుచూసింది. సర్పంచ్ రమాదేవి రెండో కుమారుడు సతీష్ నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి తప్పిపోయాడు. మానసిక రుగ్మతతో బాధపడే సతీష్ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలోని చెరువులో గుర్తుతెలియని మృతదేహం ఒకటి కనిపించింది. అది సతీష్ గా భావించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. దీంతో హుటాహుటిన అక్కడ చేరుకున్న కుటుంబసభ్యులు మృతదేహం సతీష్ ది గా నిర్థారించారు. గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. సీన్ కట్ చేస్తే.. ఆ మరుసటి రోజే సతీష్ రోడ్డుపై నడుచుకుంటూ వచ్చాడు. ఇదెంటి .. చనిపోయినవ్యక్తి నడిచి రావడం ఏమిటని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కానీ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. నేరుగా సతీష్ ఇంటికి వెళ్లేసరికి కుటుంబసభ్యులదీ అదే పరిస్థితి. కొంత సమయానికి సర్దుకొని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.

Nellore
Nellore

అయితే చెరువులో చనిపోయినది ఎవరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరైన హత్యచేసి చెరువులో పడేశారా? లేకుంటే స్థానికులెవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. మానసిక రుగ్మతతో బాధపడే సతీష్ నాలుగు రోజులు కనిపించకపోయేసరికి కంగారు చెరువులో పడిన మృతదేహం అతడిదిగా భావించారు. అందుకే కేసు మిస్టరీగా మారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. దహనం చేసిన మృతదేహం ఆనవాళ్లు నుంచి శాంపిల్ సేకరించే పనిలోపోలీసులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో చనిపోయాడునుకున్న కుమారుడు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు సంతోషపడుతుండగా..కేసు మిస్టరీగా మారడంపై పోలీసులు భారంగా పరిగణిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper