HomeతెలంగాణLock down again: తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ఉంటుందా? ఏమేం ఆంక్షలంటే?

Lock down again: తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ఉంటుందా? ఏమేం ఆంక్షలంటే?

Lock down again: భారత్ లోకి ఒమ్రికాన్ వైరస్ కొద్దిరోజుల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమ్రికాన్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమ్రికాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంటుందా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అడ్డుకునేందుకు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నాయి.

Lock down again
Lock down again

ఈనేపథ్యంలో గతంలో మాదిరిగా పూర్తి లాక్డౌన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే కేసులు పెరిగే ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ఉంటుందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒమ్రికాన్ వైరస్ డెల్టా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తుందని, గాలి ద్వారా కూడా సోకుందని స్పష్టమైందని తెలిపారు.

ఈనేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు గాలిలో సూక్ష్మరేణువులు కొద్దిసేపు తేలియాడుతుంటాయన్నారు. ఈప్రాంతంలో ఇతరులు గాలి పీల్చినపుడు వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అందుకే ప్రతీఒక్కరూ మాస్కును ఇంటా బయటా తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

విదేశాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులకు ఒమ్రికాన్ వైరస్ సోకిందని తెలిపారు. తెలంగాణలోని ఏ ఒక్కరికి ఒమ్రికాన్ సోకలేదని స్పష్టం చేశారు. ఒమ్రికాన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో రోజుకు 40వేల కరోనా టెస్టు చేస్తున్నామని వీటిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

విమానాశ్రయాల్లో కరోనా టెస్టులను పకడ్బంధీగా చేపడుతున్నటు చెప్పారు. ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వస్తే హోం ఐసోలేషన్లో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఒమ్రికాన్ అని తేలితే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిన్న విదేశాల నుంచి రాష్ట్రానికి 1,248మంది రాగా వీరిలో ముగ్గురికి పాజిటివ్ అని తేలందన్నారు.

Also Read: తెలంగాణలో ఎంటరైన ‘ఒమిక్రాన్’.. హై అలర్ట్ ప్రకటించిన వైద్యారోగ్య శాఖ!

వీరికి ఒమ్రికాన్ ఉందా? లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు. రిపోర్టులు రాగానే వివరాలను వెల్లడించన్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్యారోగ్య శాఖపై నిత్యం సమీక్షలు చేస్తూ వారికి సలహాలు, సూచనలు చేస్తున్నారు.

ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించారు. ఏదిఏమైనా ప్రతీఒక్కరు మాస్కు ధరించాల్సిందే. లేకుంటే భారీగా జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి రేసులో కవిత, కడియం, ప్రకాశ్..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version