HomeతెలంగాణTelangana BJP: హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా?

Telangana BJP: హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా?

Telangana BJP: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. అన్నింటికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగా శనివారం(మార్చి 2న) 195 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు సంబందించి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగులతోపాటు ఆరుగురు కొత్త, పాత కలయికతో అభ్యర్థులను ఎంపిక చేసింది.

హైదరాబాద్‌పై ఫోకస్‌..
బీజేపీ ఈసారి హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఒవైసీని గద్దె దించడమే లక్ష్యంగా కొత్త అభ్యర్థిని ప్రకటించింది. నుదుట రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకుని విచిత్ర వేషధారణలో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మాధవీలతను ఓవైసీపై బరిలో నిలిపింది. విరించి హాస్పిటల్స్‌ ఎండీగా మాధవీలత చాలా మందికి తెలుసు. పాత బస్తీ మూలాలు కలిగి ఉండడం, హిందుత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడం, విచించి హాస్పిటల్స్‌ యజమానిగానే కాకుండా మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సేవల సంస్థతోపాటు అమెరికాలో క్యూఫండ్‌ అనే ఫిన్‌ కార్ప్‌నూ నడుతపుతున్నారు. ‘లోపాముద్రా ఫౌండేషన్‌’ పేరుతో ఒక స్వచ్ఛందం సంస్థను పాతబస్తీ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గతానికి భిన్నంగా..
ఇక బీజేపీ గతంలో హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవసమితి చైర్మన్‌ లేదా హిందు సంస్థల ప్రతినిధులకు ఎంపీ టికెట్‌ ఇచ్చేది. ఈసారి మాత్రం భిన్నంగా అభ్యర్థిని ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగుతుండడంతో ఈసారి హైదరాబాద్‌ సీటు గెలవడమే టార్గెట్‌గా అభ్యర్థిని ఆచితూచి ఎంపిక చసినట్లు తెలుస్తోంది.

గెలుపు లెక్కలు ఇవీ..
బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంఐఎం కూడా బలహీనపడినట్లు కనిపిస్తోంది. ఇది బీజేపీకి కలిసి వస్తోందని లెక్కలు వేస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ రెండు స్థానంలో నిలిచింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌నుంచి అజారుద్దీన్‌ లేదా ఫిరోజ్‌ఖాన్‌ను బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ముస్లిం ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఫలితంగా బీజేపీకి లాభం జరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో హైదరాబాద్‌లో త్రిముఖ పోరు తప్పదని భావిస్తున్నారు. అందుకే బలమైన కొత్త ముఖాన్ని బరిలో దించినట్లు తెలుస్తోంది. ఈసారి ఒవైసీపై గెలుపు సాధ్యమే అని అంచనా వేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper
Exit mobile version