Lok Sabha Election 2024: తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార వేడి వేసవి ఎండలను మించి పెరిగింది. ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఈసారి ఎంపీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి.. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయఢంగా మోగిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఈక్రమంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన ప్రీపోల్ సర్వే సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
జాతీయ పార్టీల మధ్యే పోరు..
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మధ్యే రసవత్తర పోటీ నెలకొందని సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నట్లు అంచనా వేసింది. మరో మూడు స్థానాల్లో బీజేపీ(2–5 శాతం మార్జిన్తో) ముందంజలో ఉండగా, మరో 3 స్థానాల్లో (2–5 శాతం మార్జిన్తో) కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు అంచనా వేసింది. ఇక మరో రెండు స్థానాల్లో రెండు జాతీయ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది.
నియోజకవర్గాల వారీగా ఇలా..
లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీలు గెలిచే స్థానాలు సర్వే ప్రకారం ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ : బీజేపీ ఎడ్జ్
భువనగిరి : కాంగ్రెస్ ఎడ్జ్
చేవెళ్ల : బీజేపీ
హైదరాబాద్ : ఎంఐఎం
కరీనంగర్ : బీజేపీ
మహబూబాబాద్ : కాంగ్రెస్
మహబూబ్నగర్ : టఫ్ ఫైట్
మల్కాజ్గిరి : బీజేపీ
మెదక్ : టఫ్ ఫైట్
నాగర్కర్నూల్ : కాంగ్రెస్ ఎడ్జ్
నల్గొండ : కాంగ్రెస్
నిజామాబాద్ : బీజేపీ
పెద్దపల్లి : కాంగ్రెస్
సికింద్రాబాద్ : బీజేపీ ఎడ్జ్
వరంగల్ : కాంగ్రెస్ ఎడ్జ్
జహీరాబాద్ : బీజేపీ ఎడ్జ్