HomeతెలంగాణTelangana Village Mysterious Deaths: మూడు నెలల్లో 28 మంది.. ఊరు మొత్తం ఖాళీ.. ఇంతకీ...

Telangana Village Mysterious Deaths: మూడు నెలల్లో 28 మంది.. ఊరు మొత్తం ఖాళీ.. ఇంతకీ ఏం జరిగింది?

Telangana Village Mysterious Deaths: విరూపాక్ష సినిమా చూశారా.. అందులో ఊళ్లో వాళ్లంతా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న మత పెద్ద శాసనాల గ్రంధాన్ని తెరుస్తాడు. ఊరిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తాడు. ఊరికి కీడు జరిగిందని.. ఊరంతా ఖాళీ చేయాలని చెబుతాడు. అదంతా సినిమా కాబట్టి.. కాస్త వాస్తవానికి దూరంగానే ఉంటుంది. కానీ నిజంగా ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ ఈ సంఘటన ఏ గ్రామంలో జరిగింది.. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. వీటిపై ప్రత్యేక కథనం..

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గడిచిన 3 నెలలుగా వరుసగా 28 మంది చనిపోయారు. వివిధ కారణాలతో వారు చనిపోవడంతో గ్రామంలో ఆందోళన ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తమ ఊరికి ఏదో కీడు సోకి ఉంటుందని బలంగా నమ్మారు. గ్రామదేవతలకు పూజలు చేశారు. అయినప్పటికీ మరణాలు ఆగలేదు. దీంతో స్థానికంగా ఉన్న ఓ పూజారిని కలిశారు. గ్రామంలో జరుగుతున్న పరిణామాలను అతని దృష్టికి తీసుకెళ్లారు.

అ పూజారి వారు చెప్పిన మాటలు మొత్తం విన్న తర్వాత.. ఒక కీలకమైన విషయాన్ని చెప్పాడు. గ్రామానికి కీడు సోకిందని.. గ్రామంలో ఉన్న వారంతా ఒకరోజు తమ తమ గృహాలను ఖాళీ చేయాలని.. పొలాల్లోకి వెళ్లి కీడు వంటలు చేసుకోవాలని చెప్పారు. దీంతో గ్రామస్తులు తెల్లవారుజామునే వారి వారి గృహాలకు తాళాలు వేశారు. డప్పు చాటింపు చేశారు. అందరూ కలిసి ముకుమ్మడిగా గ్రామం దాటి వెళ్లిపోయారు. తన పొలాల్లో కీడు వంటలు చేసుకొని.. పితృదేవతలకు పెట్టి.. ఆ తర్వాత భుజించారు. ఇలా చేస్తే తమ గ్రామానికి పట్టిన కీడు తొలగిపోతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

మూడు నెలల్లో 28 మంది చనిపోవడంతో ఆ గ్రామంలో ఒక రకమైన ఆందోళన ఏర్పడింది. ఇందులో కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు. మరి కొంతమంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఇంకొంతమంది బలవంతంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.. 3 నెలల కాలంలోనే 28 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు గ్రామ దేవతలకు పూజలు చేశారు. జంతువులను కూడా బలులు ఇచ్చారు. అయినప్పటికీ మరణ మృదంగం ఆగలేదు. అయితే ఇప్పుడు కీడు వంటలు చేసుకున్న నేపథ్యంలో.. తమ గ్రామానికి అంతా మంచే జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇకపై గ్రామంలో మరణ మృదంగం ఆగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version