spot_img
HomeతెలంగాణLok Sabha Elections 2024: తెలంగాణాలో కేసీఆర్‌ పని ఖతం.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ...

Lok Sabha Elections 2024: తెలంగాణాలో కేసీఆర్‌ పని ఖతం.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ హవా.. షాకింగ్‌ సర్వే!

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు మరో వారం పది రోజుల్లో షెడ్యూల్‌ రావడం ఖాయం. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల జోష్‌ను పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగించాలని కాంగ్రెస్‌ చూస్తోంది. సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. బీజేపీ కూడా పది స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఈమేరకు ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రీపోల్‌ సర్వేలు..
పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతుండగా సర్వే సంస్థలు ప్రీపోల్‌ సర్వేలతో హడావుడి చేస్తున్నాయి. గ్రౌండ్‌ లెవల్‌ ఎలా ఉందో తెలుసుకుని ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే టైమ్స్‌నౌ, ఇండియాటుడే లాంటి పెద్ద సంస్థలు కూడా ప్రీపోల్‌ సర్వే ఫలితాలు ప్రకటించాయి. తాజాగా ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీకి తక్కువ ఉన్నాయి అన్నఅంశంపై జోరుగా సర్వేలు చేస్తున్నాయి. తెలంగాణ ట్రాకర్‌ పోల్‌ సంస్థ మరో సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. ఈ సంస్థ 17లోక్‌సభ స్థానాలకు గాను 12 స్థానాల్లో సర్వే చేసినట్లు తెలిపింది.

కాంగ్రెస్‌కే ఆధిక్యం..
తెలంగాణ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 12 స్థానాల్లో కాంగ్రెస్‌వైపే ప్రజలు మొగ్గు చూపారని తెలిపింది. ఓట్లశాతం కాంగ్రెస్‌ పార్టీకి 46 శాతం వస్తాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉండగా, 30 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఇక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితమవుతుందని తేల్చింది. గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచిన బీఆర్‌ఎస్‌కు ఈసారి కేవలం 22 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ తెలిపింది. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఈ సర్వే షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి.

ఓట్ల శాతం ఇలా..
ఇక కాంగ్రెస్‌ పార్టీకి సర్వేలో పురుషులు 42 శాతం, మహిళలు 50 శాతం మద్దతుగా నిలిచారు. బీజేపీకి పురుషులు 34 శాతం, మహిళలు 26 శాతం మద్దతుగా నిలిచారు. బీఆర్‌ఎస్‌కు పురుషులు 21 శాతం, మహిళలు 23 శాతం అనుకూలంగా ఉన్నట్లు తెలంగాణ ట్రాకర్‌ పోల్‌ సంస్థ తెలిపింది.

పీఎం అభ్యర్థిపై..
ఇక ప్రధాన మంత్రి ఎవరైతే బాగుంటుంది అన్న అంశంపై సర్వేలో 51 శాతం మంది రాహుల్‌గాంధీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. నరేంద్రమోదీకి కేవలం 38 శాతం మాత్రమే మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. కేసీఆర్‌ ప్రధాని కావాలని కేవలం 1 శాతం మాత్రమే కోరుకుంటున్నారు. 8 శాతం మంది ఎవరైనా ఓకే అని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version