spot_img
HomeతెలంగాణTelangana Political News: మహిళలకు రేవంత్ రెడ్డి పెద్ద హామీ.. నెరవేరుతుందా?

Telangana Political News: మహిళలకు రేవంత్ రెడ్డి పెద్ద హామీ.. నెరవేరుతుందా?

Telangana Political News : దేశంలో 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గతంలోనే పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అయితే కరోనా, జన గణనలో ఆలస్యం నియోజకవర్గాల పునర్విభజనపైనా పడింది. 2026లో జన గణనకు కేంద్రం ఇటీవలే షెడ్యూల్‌ ప్రకటించింది. జన గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం ఇటీవల కొత్త లెక్కలు చెప్పారు. వచ్చే అసెంబ్లీలో 60 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారని ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు బలమైన చర్యలు చేపడుతున్నారు. రాజీవ్‌ గాంధీ స్ఫూర్తితో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసినట్లే, రాబోయే రోజుల్లో శాసనసభ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. 60 మంది మహిళలను ఎమ్మెల్యేలుగా గెలిపించాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. 2026 నుంచి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు కానుంది. 33 శాతం సీట్లు మహిళలకు చేటాయించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కూడా రేవంత్‌ తాజాగా ప్రకటన చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : సన్నబియ్యం తింటున్నారా అక్కా.. రేవంత్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్

రాజీవ్‌ గాంధీ స్ఫూర్తితో..
రేవంత్‌ రెడ్డి, రాజీవ్‌ గాంధీ ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. 1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించారు. దీంతో మహిళలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా, జెడ్పీ చైర్‌పర్సన్లుగా మున్సిపల్‌ చైర్‌పర్సన్లుగా, మేయర్లుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు శాసనసభ స్థానాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చేందుకు రేవంత్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీలో 60 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండాలని సంకల్పించారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు..
మహిళల రిజర్వేషన్‌ బిల్‌ 2023 ఆగస్టులో ఆమోదించబడింది. తర్వాత, శాసనసభ స్థానాల్లో మళ్లీ మహిళలకు 33% రిజర్వేషన్‌లు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ బిల్‌ రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 50%కి పెంచే లక్ష్యంతో ఉంది. రేవంత్‌ రెడ్డి ఈ విధానాన్ని అనుసరించి, సమాజంలో మహిళల సాధికారతను పెంపొందించేందుకు 60 మంది మహిళలను ఎమ్మెల్యేలుగా గెలిపించాలనే సంకల్పాన్ని ప్రకటించారు.

మహిళల ప్రాతినిధ్యం పెంపు..
రేవంత్‌ రెడ్డి యొక్క 60 మంది మహిళలను ఎమ్మెల్యేలుగా గెలిపించాలనే లక్ష్యం కాంగ్రెస్‌ పార్టీ యొక్క రాజకీయ వ్యూహంలో ఒక కీలకమైన అడుగు. తెలంగాణలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం ద్వారా, పార్టీ తన ఓటు బ్యాంకును బలోపేతం చేయడంతోపాటు, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ లక్ష్యం సాధించడానికి, సమర్థవంతమైన, సమాజంలో సానుకూల మార్పులు చేసిన మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని రేవంత్‌ పేర్కొన్నారు.
ఆచరణ అంత ఈజీ కాదు..
60 మంది మహిళలను ఎమ్మెల్యేలుగా గెలిపించడం అనేది అంత సులభమైన లక్ష్యం కాదు. రాజకీయ రంగంలో మహిళలు ఎదుర్కొనే సామాజిక, సాంస్కృతిక అడ్డంకులు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఆర్థిక, సామాజిక మద్దతు సమస్యలు ఈ లక్ష్యాన్ని సవాల్‌గా మారతాయి. అయినప్పటికీ, రేవంత్‌ రెడ్డి సంకల్పం, సమర్థవంతమైన మహిళా నాయకులను గుర్తించి, వారికి అవకాశాలు కల్పించడం ద్వారా ఈ అడ్డంకులను అధిగమించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version