HomeతెలంగాణTelangana Municipal Election: కేటీఆర్ సిరిసిల్లలో బంగారు నాణెం.. ఫలితాల వేళ ఆసక్తికర చర్చ

Telangana Municipal Election: కేటీఆర్ సిరిసిల్లలో బంగారు నాణెం.. ఫలితాల వేళ ఆసక్తికర చర్చ

Telangana Municipal Election: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదయింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ గెలుపు పై ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. అయితే కొన్ని సంస్థలు అధికార కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తుందని ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడించాయి.

ఈ ఎన్నికల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో అధికార పార్టీ నాయకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెల్లడైన కొన్ని స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంతేకాదు ఇంకా ఎక్కువ స్థానాల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో గాంధీభవన్ వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలు నినాదాలు చేస్తూ.. పటాసులు కాల్చుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు.. ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మున్సిపాలిటీగా సిరిసిల్ల నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఎమ్మెల్యే కేటీఆర్. గతంలో కేటీఆర్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. ఒకరకంగా షాడో ముఖ్యమంత్రిగా కనిపించారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో.. సిరిసిల్ల మున్సిపాలిటీ మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓ వార్డులో ఓటర్లకు ఓ అభ్యర్థి బంగారు నాణేలు పంపిణీ చేశాడు. దీంతో ఓటర్లు బంగారం అంటూ మురిసిపోయారు. అయితే రాగి నాణేల కు బంగారు పూత పూసి ఇచ్చారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ సంఘటన వెలుగులోకి రాగా.. ఇప్పుడు ఎన్నికల ఫలితాల సమయంలో కూడా చర్చకు రావడం.. కొంతమంది ఓటర్లు బహిరంగంగానే ఈ విషయంపై తీవ్రస్థాయిలో మాట్లాడారు. దీంతో సిరిసిల్ల మున్సిపాలిటీ కాస్త రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. సదరు అభ్యర్థి ఎన్నికల్లో గెలవడం కోసమే బంగారు నాణేలు ఇస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడని.. చివరికి రాగి నాణేలు ఇచ్చినట్టు తేలడంతో ఓటర్లు మండిపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version