Summer Effect in Yadadri : ఒక వైపు ఎండ మోత.. మరోవైపు సౌకర్యాలు లేక యాదాద్రిలో భక్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో యాదాద్రి లక్ష్మనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తు భక్తులు తరలివస్తున్నారు. కానీ 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతతో యాదాద్రి నిప్పులకొలిమిలా మారుతోంది. ఎండకు కృష్ణ శిలలతో నిర్మించిన ప్రధానాలయం, దాని పరిసరాలు వేడెక్కుతుండడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.