Nalgonda Death Certificate Issue: కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా అనాధాశ్రమాల్లో వదిలేస్తున్న పిల్లలను చూస్తున్నాం. కొందరైతే స్మశానంలో బతికుండగానే వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు చేస్తున్న పొరపాట్లు వాళ్ల నిర్లక్ష్యానికి అర్థం పడుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. దీంతో బాధితురాలు ఎమ్మెల్సీ ని ఆశ్రయించింది.
ఎమ్మెల్సీకి ఫిర్యాదు..
నల్గొండ కలెక్టరేట్ పరిధికి చెందిన శిరీషాల మల్లమ్మ బతికుండగానే చనిపోయినట్లు అధికారులు సర్టిఫై చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఫిర్యాదు చేసింది. స్పందించిన మల్లన్న ఈ విషయాన్ని నల్గొండ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన కలెక్టర్ మాట్లాడుతుడగా,.. మల్లమ్మ అనే వృద్ధురాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. అయినప్పటికీ స్థానిక అధికారులు ఆమె పేరిట డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో ఆమెకు రావాల్సిన వృద్ధాప్య పెన్షన్, ప్రభుత్వ సౌకర్యాలు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.మల్లన్న జోక్యంఈ అన్యాయాన్ని గమనించిన తీన్మార్ మల్లన్న స్వయంగా అడిగారు.
నీళ్లు నమిలిన కలెక్టర్..
ఎమ్మెల్సీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా కలెక్టర్ నీళ్లు నమిలారు. జిల్లా పాలన అధికారిగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేశారు.. ఈ ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇది మొదటిసారి కాదు..
ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. మేక పర్యాయాలు ఇలాంటి తప్పుడు వివరాల నమోదు ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఆధార్ లింకింగ్, డేటా అప్డేషన్ లోపాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బతికున్న వ్యక్తికి చావు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పెన్షన్ ఆగిపోవడం, ఇతర ప్రభుత్వ సహాయాలు రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “బతికున్న వారిని చంపేసి సర్టిఫికేట్ ఇచ్చే అధికారులను ఎవరు బాధ్యుల్ని చేస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.తీన్మార్ మల్లన్న ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు జరగకపోవడం అధికార వ్యవస్థలోని ఉదాసీనతను బయటపెట్టింది.
