HomeతెలంగాణNalgonda Death Certificate Issue: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్.. కలెక్టర్ నే ఆడేసుకున్న తీన్మార్...

Nalgonda Death Certificate Issue: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్.. కలెక్టర్ నే ఆడేసుకున్న తీన్మార్ మల్లన్న.. వైరల్ వీడియో

Nalgonda Death Certificate Issue: కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా అనాధాశ్రమాల్లో వదిలేస్తున్న పిల్లలను చూస్తున్నాం. కొందరైతే స్మశానంలో బతికుండగానే వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు చేస్తున్న పొరపాట్లు వాళ్ల నిర్లక్ష్యానికి అర్థం పడుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. దీంతో బాధితురాలు ఎమ్మెల్సీ ని ఆశ్రయించింది.

ఎమ్మెల్సీకి ఫిర్యాదు..
నల్గొండ కలెక్టరేట్ పరిధికి చెందిన శిరీషాల మల్లమ్మ బతికుండగానే చనిపోయినట్లు అధికారులు సర్టిఫై చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఫిర్యాదు చేసింది. స్పందించిన మల్లన్న ఈ విషయాన్ని నల్గొండ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన కలెక్టర్ మాట్లాడుతుడగా,.. మల్లమ్మ అనే వృద్ధురాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. అయినప్పటికీ స్థానిక అధికారులు ఆమె పేరిట డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో ఆమెకు రావాల్సిన వృద్ధాప్య పెన్షన్, ప్రభుత్వ సౌకర్యాలు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.మల్లన్న జోక్యంఈ అన్యాయాన్ని గమనించిన తీన్మార్ మల్లన్న స్వయంగా అడిగారు.

నీళ్లు నమిలిన కలెక్టర్..
ఎమ్మెల్సీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా కలెక్టర్ నీళ్లు నమిలారు. జిల్లా పాలన అధికారిగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేశారు.. ఈ ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఇది మొదటిసారి కాదు..
ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. మేక పర్యాయాలు ఇలాంటి తప్పుడు వివరాల నమోదు ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఆధార్ లింకింగ్, డేటా అప్‌డేషన్ లోపాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బతికున్న వ్యక్తికి చావు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పెన్షన్ ఆగిపోవడం, ఇతర ప్రభుత్వ సహాయాలు రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “బతికున్న వారిని చంపేసి సర్టిఫికేట్ ఇచ్చే అధికారులను ఎవరు బాధ్యుల్ని చేస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.తీన్మార్ మల్లన్న ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు జరగకపోవడం అధికార వ్యవస్థలోని ఉదాసీనతను బయటపెట్టింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version