spot_img
HomeతెలంగాణMonkey : విషంతో తల్లి చనిపోయింది.. ఏడ్చి ఏడ్చి పిల్ల కూడా.. కలిచి వేస్తున్న దృశ్యాలు

Monkey : విషంతో తల్లి చనిపోయింది.. ఏడ్చి ఏడ్చి పిల్ల కూడా.. కలిచి వేస్తున్న దృశ్యాలు

Monkey : గత ప్రభుత్వం కోతుల సమస్యను పరిష్కరించేందుకు పండ్ల మొక్కలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ హామీ గాలికి కొట్టుకుపోయింది. అయితే కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్న కొంతమంది వాటిని మట్టు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. విషాహారం పెట్టి వాటిని చంపేశారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లిలో సింగరేణి వై జంక్షన్ వద్ద కొంతమంది ఆహారంలో విషాన్ని కలిపి కోతులకు పెట్టారు. ఆ కోతులు కన్నుమూశాయి. సింగరేణి ప్రైవేట్ లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపంలో గుంపులుగా పడి కోతులు చనిపోయాయి. అయితే ఈ సమాచారాన్ని కొంతమంది అటవీశాఖ అధికారులకు అందించారు. అయితే వారు సకాలంలో స్పందించకపోవడంతో కోతులు చనిపోయాయని స్థానికులు అంటున్నారు.. విషాహారం తిని దాదాపు 12 కోతులు చనిపోయాయి. అయితే ఇందులో ఒక 10 రోజుల క్రితం పుట్టిన ఒక కోతి తన తల్లి ప్రేమ కోసం తీవ్రంగా తాపత్రయపడింది. తన తల్లి కోతి పక్కన కూర్చొని లేపడం మొదలుపెట్టింది. ఎంతకీ తల్లి కోతి లేవకపోవడంతో పిల్ల కోతి తీవ్రంగా రోదించింది. ఆ తర్వాత అది కూడా కన్ను మూసింది. కోతులు ఒకదాని తర్వాత ఒకటి చనిపోవడంతో.. అవి పడుతున్న బాధను చూసి చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు. కోతులు చనిపోవడంతో.. వాటిని చూడ్డానికి ఇతర ప్రాంతాల నుంచి కొన్ని కోతులు వచ్చాయి. ఈ క్రమంలో అవి చేసిన రోదనలతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది.

జంతు ప్రేమికుల ఆగ్రహం

ఈ ఘటన పై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల విషయంలో కొంతమంది విషాహారం పెట్టి వాటిని చంపేశారని.. ఇది క్షమార్హం కాదని చెబుతున్నారు..” కొంతమంది ఆహారంలో విషం కలిపి కోతులకు పెట్టారు. ఆ కోతులు ఆహారాన్ని తిని నురగ కక్కుతూ చనిపోయాయి. కోతులు తీవ్ర అస్వస్థతకు గురై గిలాగిలా కొట్టుకున్నాయి. ఫలితంగా 12 కోతులు చనిపోయాయి. ఇలా చనిపోయిన వాటిల్లో ఒక కోతికి పది రోజుల క్రితం జన్మించిన పిల్ల కోతి ఉంది. అయితే ఆ పిల్ల కోతి విషం కల్పిన ఆహారం తినలేదు. దీంతో ఆ తల్లి కోతి అలానే చనిపోయింది. దీంతో ఆ పిల్ల కోతి విషం తెలియక తన తల్లిని లేపడం మొదలుపెట్టింది. కానీ ఎంతకీ ఆ తల్లి కోతి లేవలేదు. ఇదే విషయాన్ని అటవీశాఖ అధికారులకు చెబితే వారు పట్టించుకోలేదు. ఒకవేళ వారు కనుక సకాలంలో స్పందించి ఉంటే కొన్ని కోతులైనా బతికి ఉండేవని” స్థానికులు అంటున్నారు. అయితే ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కొంతమంది ఈ విషయాన్ని కేంద్ర అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version