HomeతెలంగాణKTR Comments: కేసీఆర్ పరిస్థితి గాలి వానలో.. వాన నీటిలో.. కేటీఆరేనా ఇలా మాట్లాడుతున్నది..

KTR Comments: కేసీఆర్ పరిస్థితి గాలి వానలో.. వాన నీటిలో.. కేటీఆరేనా ఇలా మాట్లాడుతున్నది..

KTR Comments: రాజకీయ నాయకులు వాస్తవాలు చెబుతున్నప్పుడు వాటికి కాస్త షుగర్ కోటెడ్ వేయాలి. కచ్చా మ్యాంగో లాగా చెబితే మాత్రం ఈ సోషల్ మీడియా కాలంలో వేరే విధంగా జనాల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని రకాల కవరింగ్స్ ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు. పైగా నేటి కాలంలో ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది.

రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా అధిక హోదా ఉన్న నాయకులు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. జనాలకు వచ్చారనే ఉత్సాహంతో.. కార్యకర్తలు కల ముందు కనిపిస్తున్నారని ఆనందంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. ఆ తర్వాత జరిగే పర్యవసనాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేటి కాలంలో అయితే రాజకీయ నాయకులు నాలుక మీద అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు వేరే అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. దానివల్ల అసలు టాపిక్ పక్కకకు వెళ్లి.. వేరే విషయం చర్చలోకి వస్తోంది. దీనివల్ల అభాసుపాలు కావడం నేతల వంతు అవుతోంది.

ఈ జాబితాలో ఇప్పుడు కేటీఆర్ చేరిపోయారు. కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇటీవల ఆయన లైన్ తప్పినట్టు కనిపిస్తోంది. ఆ మధ్య వరంగల్ లో ఒక సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ.. కొద్దిరోజుల్లో ఆయన కూర్చున్న కూర్చుని లాగి పడ దెం*** తే అని అన్నారు. ఇది ఎంత సంచలనం కావాలో అంత సంచలనమైంది. దీంతో కేటీఆర్ మీద ఉన్న అభిప్రాయం కాస్త చాలామందిలో తగ్గిపోయింది. ఇప్పుడిక కేటీఆర్ హైదరాబాదులో జరిగిన ఓ మీటింగ్లో తన తండ్రి పార్టీని నిలబెట్టడానికి పడిన కష్టాన్ని వివరించే క్రమంలో.. ఒకప్పుడు కెసిఆర్ పరిస్థితి పార్టీని పెట్టినప్పుడు “గాలి వానలో.. వాన నీటిలో” అన్నట్టుగా ఉండేదని వ్యాఖ్యానించారు. దీని ముందు ఏం జరిగింది.. దీని తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే కెసిఆర్ మీద కేటీఆర్ ఒక్క నెగిటివ్ వర్క్ మాట్లాడినా సరే అది వేరే విధంగా వెళుతూ ఉంటుంది. వాడుకునే వాళ్ళు దానిని 100 విధాలుగా ఉపయోగించుకుంటారు. అందువల్ల కేటీఆర్ లాంటి నాయకులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

నేటి సోషల్ మీడియా కాలంలో బురద చల్లడమే అసలు సిసలైన రాజకీయం లాగా నడుస్తోంది. అలాంటప్పుడు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఏదైనా విషయాలు చెబుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. షుగర్ కొటెడ్ మందులాగా జనాల్లోకి ఎక్కించాలి. లేకపోతే ఇదిగో ఇలా అభాసుపాలు కావాల్సి వస్తుంది. కేటీఆర్ కావాలని అలా అన్నప్పుడు.. కాంగ్రెస్ నాయకులు లేదా బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా ఆయన మాట్లాడినా మాటలను మార్చుకుంటారు. అంతేకాదు తమకు నచ్చినట్టుగా వాడుకుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular