Homeటాప్ స్టోరీస్Telangana Debt: తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు..!

Telangana Debt: తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు..!

Telangana Debt: మిగులు బడ్జెట్‌తో ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. అయితే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఏడాదిన్నరగా కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని పాలిస్తోంది. బడ్జెట్‌ లేకనే పథకాల అమలు ఆలస్యమవుతోందని చెబుతోంది. ఇదంతా గత బీఆర్‌ఎస్‌ పాపమే అని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు. లంకె బిందులు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు కనిపించాయని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా అప్పులు ఆస్తుల పెరుగుదలపై ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ లోక్‌సభలో వెల్లడించింది. 2024 మార్చి 31 నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,50,520.39 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. ఈ నివేదిక ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: మెదక్‌ ఎంపీకి ఆగని బెదిరింపులు.. అగంతకులను గుర్తించిన పోలీసులు?

భారంగా అప్పులు..
ఎంపీ రఘునందన్‌ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.3,50,520.39 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది. 2014–15లో రాష్ట్ర అప్పులు రూ.69,603.87 కోట్లుగా ఉండగా, పదేళ్లలో అవి గణనీయంగా పెరిగి రూ.3,14,545 కోట్ల అదనపు అప్పుగా నమోదయ్యాయి. ఈ గణాంకాలు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక విధానాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇక అప్పుల పెరుగుదలతోపాటు, రాష్ట్ర ఆస్తులు కూడా గణనీయంగా పెరిగాయి. 2014–15లో రూ.83,142.68 కోట్లుగా ఉన్న ఆస్తులు 2023–24 నాటికి రూ.4,15,099.69 కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి సూచనగా ఉన్నప్పటికీ, అప్పులు, ఆస్తుల మధ్య నిష్పత్తి ఆర్థిక స్థిరత్వంపై చర్చను రేకెత్తిస్తోంది. ఆస్తులలో ఈ పెరుగుదల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర పెట్టుబడుల వల్ల కావచ్చు, కానీ అప్పుల భారం దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పుల పెరుగుదల..
2014 నుంచి 2023 డిసెంబర్‌ వరకు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. గత ప్రభుత్వం రూ.3,14,545 కోట్ల అప్పు తీసుకున్నట్లు కేంద్రం నివేదిక తెలిపింది. ఈ అప్పులు ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించబడినట్లు అనుమానించబడుతున్నప్పటికీ, ఈ నిధుల వినియోగంపై పారదర్శకత లోపించిందని విమర్శలు ఉన్నాయి. అప్పులలో ఈ గణనీయ పెరుగుదల రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై సమీక్ష అవసరమని సూచిస్తుంది.

Also Read: చంద్రశేఖరా.. ఏమైంది నీ పార్టీకి.. పతనం దిశగా బీఆర్‌ఎస్‌!

అప్పుల పెరుగుదల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని సృష్టిస్తుంది, ముఖ్యంగా వడ్డీ చెల్లింపులు, అప్పు తిరిగి చెల్లించే బాధ్యతల విషయంలో. ఆస్తుల వృద్ధి సానుకూల సంకేతమైనప్పటికీ, అప్పుల నిష్పత్తి ఆర్థిక స్థిరత్వానికి సవాల్‌గా మారవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఆదాయ వనరులను పెంచడం, వ్యయ నిర్వహణను మెరుగుపరచడం,అప్పులను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version