HomeతెలంగాణHarish Rao : కేసీఆర్‌ సభతో కాంగ్రెస్‌లో టెన్షన్‌ ఉందా?

Harish Rao : కేసీఆర్‌ సభతో కాంగ్రెస్‌లో టెన్షన్‌ ఉందా?

Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కె.చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) వరంగల్‌లో నిర్వహించబోయే సభ కాంగ్రెస్‌ నాయకులలో ఆందోళన రేకెత్తిస్తోందా అంటే అవుననే అంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. కేసీఆర్‌ ఏం మాట్లాడతారు, ఎలాంటి రాజకీయ వ్యూహాలు ప్రకటిస్తారనే ఉత్కంఠ కాంగ్రెస్‌ శిబిరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌రావు, ‘వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్‌ఎస్‌దే‘ అని ధీమా వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్‌ను టెన్షన్‌ పడవద్దని సవాల్‌ విసిరారు.

Also Read : తీన్మార్‌ మల్లన్న Vs కేటీఆర్‌.. నకిలీ వీడియోల కేసులో హైకోర్టు నోటీసులు

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ 25వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబోయే కేసీఆర్‌ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారింది. కేసీఆర్‌ ఈ సభలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని, ప్రజలను ఆకర్షించే కొత్త హామీలను ప్రకటిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. కేసీఆర్‌ గతంలో తన ప్రసంగాల ద్వారా ప్రజలను ఆకర్షించిన చరిత్ర ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ మౌనం వీడి, సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తుండటం కాంగ్రెస్‌ నాయకులను కలవరపెడుతోంది. ఈ సభలో కేసీఆర్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా ఉపయోగించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బోనాలు, బతుకమ్మ వంటి సాంస్కృతిక ఉత్సవాలకు హాజరయ్యే విధంగా ప్రజలు కేసీఆర్‌ సభ కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొంటున్నారు.

హరీశ్‌రావు సవాల్‌..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు కాంగ్రెస్‌ నాయకులను ఉద్దేశించి, ‘టెన్షన్‌ పడవద్దు, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది‘ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. 2023 ఎన్నికల ఓటమి తర్వాత, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు గుప్పిస్తూ, రైతు సమస్యలు, రుణమాఫీ వైఫల్యాలను ఎత్తిచూపారు. హరీశ్‌రావు గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ స్థానాన్ని బలోపేతం చేయడానికి ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తూ, క్యాడర్‌ను సమీకరిస్తున్నారు.

కాంగ్రెస్‌పై ఒత్తిడి..
హరీశ్‌రావు వ్యాఖ్యలు కాంగ్రెస్‌పై రాజకీయ ఒత్తిడిని పెంచుతూ, బీఆర్‌ఎస్‌ ఇంకా రాజకీయంగా బలంగా ఉందని సందేశం ఇస్తున్నాయి. కేసీఆర్‌ సభ ద్వారా బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో జాప్యం, రైతు రుణమాఫీలో వైఫల్యాలను బీఆర్‌ఎస్‌ ప్రధాన అస్త్రంగా ఉపయోగించనుంది.

బీఆర్‌ఎస్‌ రాజకీయ పునరుజ్జీవన వ్యూహం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో నీరసం నెలకొంది. అయితే, కేసీఆర్‌ సభల ద్వారా పార్టీని పునరుజ్జీవనం చేయాలని భావిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో హిప్‌ ఫ్రాక్చర్‌ కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్, 2025లో మళ్లీ సభల ద్వారా యాక్టివ్‌ అవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలాన్ని చాటడానికి కేసీఆర్‌ క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్, హరీశ్‌రావు, సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగిస్తూ, కాంగ్రెస్‌పై విమర్శలతో పాటు పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు.

కాంగ్రెస్‌ ఎదుర్కొనే సవాళ్లు
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హామీల అమలులో జాప్యం, రైతుల అసంతప్తి, మరియు హైదరాబాద్‌ అభివృద్ధి ప్రాజెక్ట్‌లపై విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన పూర్తి రుణమాఫీ అమలు కాకపోవడంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేసీఆర్‌ సభలు కాంగ్రెస్‌పై రాజకీయ ఒత్తిడిని పెంచుతాయని, దీన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ కొత్త వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular