spot_img
Homeతెలంగాణహైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరిన్ని సిటీ బస్సులు...?

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరిన్ని సిటీ బస్సులు…?

TSRTC

గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సడలింపుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో గతంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో కొంతమంది వ్యక్తిగతంగా వాహనాలను కొనుగోలు చేశారు. గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆర్టీసీ సైతం 50 శాతం సిటీ బస్సులకు మాత్రమే అనుమతులు ఇచ్చింది.

Also Read: కేసీఆర్‌‌లో ఈ మార్పులు ఎవరైనా ఊహించారా..!

అయితే 50 శాతం సిటీబస్సుల వల్ల కొన్ని రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అయితే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. 75 శాతానికి సిటీ బస్సులను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read: నాయకత్వ మార్పు సీనియర్లకు ఇష్టం లేదా..: అందుకే ఈ సైలెంటా..!

సీఎం కేసీఆర్ అనుమతితో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఓకే చెప్పారని అన్నార్. బిజీ రూట్లలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో చెక్ పెట్టినట్టే అని చెప్పవచ్చు. అయితే 75 శాతం సిటీ బస్సులు ప్రజలకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

హైదరాబాద్ లో పరిమిత సంఖ్యలో నడుస్తున్నప్పటికీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మాత్రం పూర్తిస్థాయిలో బస్సులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో 100 శాతం సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version