CM Revanth Reddy
CM Revanth Reddy :
అంతర్జాతీయ గుర్తింపు
ఒసాకా ఎక్స్పో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచస్థాయి వేడుక, ఇది దేశాలు, పరిశ్రమలు తమ నవీన ఆలోచనలను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే వేదిక. 2025 ఎడిషన్లో ‘మన జీవనానికి భవిష్య సమాజ రూపకల్పన’ అనే థీమ్తో ఏప్రిల్ 13 నుంచి ఆరు నెలల పాటు జపాన్లోని యుమేషిమాలో ఈ ఎక్స్పో జరుగుతోంది. ఈ ఏడాది తెలంగాణ భారత పెవిలియన్లో ప్రత్యేక ‘తెలంగాణ జోన్’ ఏర్పాటు చేసి, సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 21న దీనిని ఘనంగా ప్రారంభించారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
తెలంగాణ పెవిలియన్..
పెట్టుబడుల ఆకర్షణలో రికార్డు
సీఎం రేవంత్రెడ్డి జపాన్ పర్యటనలో రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఎన్టీటీ డేటా, నెసా కంపెనీలు హైదరాబాద్లో రూ.10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. టోషిబా కార్పొరేషన్ రూ.562 కోట్లతో రుద్రారం వద్ద కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పందం చేసింది. అదనంగా, ఎకో టౌన్ ప్రాజెక్టు కోసం జపాన్కు చెందిన ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలతో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ)లు కుదిరాయి.
Also Read : గులాబీ తుఫాను రాగం… కేటీఆర్ రాజకీయ జోష్యం
Web Title: Cm revanth reddy osaka expo telangana flag
Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News