తెలంగాణPinnelli Ramakrishna Reddy: మాచర్లలో అరాచకం వెనుక పిన్నెల్లి.. వైరల్ వీడియో బయటపడిందిలా

Pinnelli Ramakrishna Reddy: మాచర్లలో అరాచకం వెనుక పిన్నెల్లి.. వైరల్ వీడియో బయటపడిందిలా

Pinnelli Ramakrishna Reddy: దొంగే దొంగ అన్నట్టు ఉంది వైసీపీ నేతల పరిస్థితి. పోలింగ్ నాడు జరిగిన విధ్వంసాలు ఇప్పుడు బయటకు వస్తుండడంతో.. వైసీపీ నేతల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. మాచర్లలో పోలింగ్ నాడు విధ్వంసాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈవీఎంల ధ్వంసం, టిడిపి ఏజెంట్ తల పగలడం వెనుక గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నాడు పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేసిన సిసి ఫుటేజ్ బయటపడడంతో.. ఈ విధ్వంసానికి పాల్పడింది వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావడం ఆందోళన కలిగిస్తోంది.

అసలు మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ఎంపీపీ జడ్పిటిసి ఎన్నికలు ఏకగ్రీవంగాయి. మాచర్ల మున్సిపాలిటీలో అయితే ఒక్క వార్డు కూడా సక్రమంగా ఎన్నిక జరగలేదు. చివరకు టిడిపి నేతల వాహనాలపై ఏ తరహాలో దాడులు జరిగాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే మాదిరిగా ఎన్నికలు జరుగుతాయని ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటు వైసీపీ నేతలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. ఎన్నికలకు ముందు భారీగా అధికారులను మార్చారు. దీంతో ఇది వైసిపి నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే దాడులకు దిగినట్లు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు మాచర్లలో అధికారులు మారారు. ఇలా మారిన చోట మాత్రమే విధ్వంసాలు జరిగాయని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కేవలం అధికారులను మార్చి రిగ్గింగ్ కు పాల్పడేందుకే ఈ తరహా చర్యలకు దిగారని వారి అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సాక్షాత్ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే.. పోలింగ్ కేంద్రంలోకి దూరి.. ఈవీఎంలను నేలకేసి కొట్టి.. అడ్డుకున్న టిడిపి ఏజెంట్ తల పగలగొట్టడం స్పష్టంగా సిసి ఫుటేజ్ లో కనిపిస్తోంది. బహుశా ఈ వీడియోలు బయటపడతాయని.. ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొత్తం మాచర్ల అట్టుడికి పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికారుల మార్పిడితో.. టిడిపి కూటమి ఈ పని చేయించిందన్న ఆరోపణలు వైసీపీ నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు సిసి ఫుటేజ్ బయటపడేసరికి వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

YSRCP Kapu leaders : ‘డీ లిమిటేషన్’ వరకు వైసీపీ కాపు నేతల టైం పాస్!

YSRCP Kapu leaders : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిలో ఒక రకమైన భయం ఉంది. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో...

YS Jagan Mohan Reddy: టచ్లోకి కాంగ్రెస్ అగ్ర నేతలు.. జగన్ ఆలోచన అదే!

YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ఒక...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...

Ration Card: రేషన్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Ration Card: దేశంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్...
Exit mobile version