యువకుడి హత్య.. కులాంత వివాహమే కారణమా..?

కులాంతర వివాహం ఇష్టంలేని ఓ తండ్రి యువకుడిని అతి కిరాతకంగా హత్యచేయించినట్లు తెలుస్తోంది.గతంలో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య ఉదంతోనే ఈ సంఘటన జరగడం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని చందానగర్‌ ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డి, హేంత్‌ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి ప్రేమజంటను కిడ్నాప్‌ చేశారు. యువతి కారులో నుంచి పారిపోయి 100కు సమాచారం ఇచ్చింది. హేమంత్‌ను మాత్రం సంగారెడ్డికి తీసుకెళ్లి హత్య చేసినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. అయితే […]

Written By: NARESH, Updated On : September 25, 2020 10:41 am

murderd

Follow us on

కులాంతర వివాహం ఇష్టంలేని ఓ తండ్రి యువకుడిని అతి కిరాతకంగా హత్యచేయించినట్లు తెలుస్తోంది.గతంలో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య ఉదంతోనే ఈ సంఘటన జరగడం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని చందానగర్‌ ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డి, హేంత్‌ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి ప్రేమజంటను కిడ్నాప్‌ చేశారు. యువతి కారులో నుంచి పారిపోయి 100కు సమాచారం ఇచ్చింది. హేమంత్‌ను మాత్రం సంగారెడ్డికి తీసుకెళ్లి హత్య చేసినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇది పరువు హత్యేనని తెలుస్తోంది.