
గండికోట పరిహారం చెల్లింపు విషయంలో వైకాపా అవినీతిని బయటపెట్టారనే కక్షతోనే సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని హత్య చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు లేఖ రాశారు. పేదలను హింసించి హతమార్చటం రాష్ట్రంలో సర్వసాధారణమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభకోణాన్ని వెలికి తీసినందుకు జరిగిన ఈ హత్యను ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.