నేడు సీఎం కేసీఆర్ కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కీలక భేటీని ఏర్పాటు చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తీసుకునే నిర్ణయంపై సమావేశంలో చర్చించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ‘యూజర్ మాన్యువల్ ’పేజీలో ఉన్న ఆధార్ కార్డు కాలమ్ ను తొలగించాలని, అప్పటి వరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. యూజర్ మాన్యువల్ లో ఆధార్కు సంబంధించిన ప్రస్తావనను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, ఆస్తిపన్ను నెంబర్ కోరే వారిని ఆధార్ సమాచారం […]

Written By: Suresh, Updated On : December 19, 2020 8:54 am
Follow us on


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కీలక భేటీని ఏర్పాటు చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తీసుకునే నిర్ణయంపై సమావేశంలో చర్చించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ‘యూజర్ మాన్యువల్ ’పేజీలో ఉన్న ఆధార్ కార్డు కాలమ్ ను తొలగించాలని, అప్పటి వరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. యూజర్ మాన్యువల్ లో ఆధార్కు సంబంధించిన ప్రస్తావనను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, ఆస్తిపన్ను నెంబర్ కోరే వారిని ఆధార్ సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేయదాదని పేర్కొంది. అయితే రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగించుకోవచ్చని తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిని గుర్తించడానికి వేరే పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చని తెలిపింది. దీంతో రిజిస్ట్రేషన్ విషయంలో మార్పులు చేద్దామా..? అనే ఆలోచనల నేపథ్యంలో నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించిన కేసీఆర్ ఆ విషయంపై మరోసారి రెవెన్యూ అధికారులతో కలిసి మాట్లాడనున్నారు. ప్రగతిభవన్ లో నిర్వహించే ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.