ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన బాలిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, పార్టీ నేత ప్రియాంక బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వారి పట్ల ప్రవర్తించిన తీరుకు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీఐ విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మౌనదీక్ష పాటించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.