కరెంట్ తీగలు తగిలి ఇద్దరు మృతి

నిర్మల్ జిల్లాలో కరెంట్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామ పంచాయతీలోని రేగడి గ్రామానికి చెందిన జి చందు, అడెపు గణపతి ఇద్దరూ కడెం మండల కేంద్రానికి సంత కోసం వచ్చారు. సామగ్రి కొని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి కావడంతో తొందరగా వెళ్లేందుకు దత్తు జీ పేట్ గ్రామంలోని వరి చేను గుండా వెళ్లారు. దీంతో అడవి జంతువుల నుంచి రక్షించేందుకు వేసిన కరెంట్ తీగలు వారికి తగిలాయి. దీంతో వారిద్దరు […]

Written By: Suresh, Updated On : November 18, 2020 3:04 pm
Follow us on

నిర్మల్ జిల్లాలో కరెంట్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామ పంచాయతీలోని రేగడి గ్రామానికి చెందిన జి చందు, అడెపు గణపతి ఇద్దరూ కడెం మండల కేంద్రానికి సంత కోసం వచ్చారు. సామగ్రి కొని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి కావడంతో తొందరగా వెళ్లేందుకు దత్తు జీ పేట్ గ్రామంలోని వరి చేను గుండా వెళ్లారు. దీంతో అడవి జంతువుల నుంచి రక్షించేందుకు వేసిన కరెంట్ తీగలు వారికి తగిలాయి. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. వీరి మరణంతో రేగడి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.