భారీ వర్షాల నేపథ్యంలో పత్తి చేలు నీటిలో మునిగిపోయిందని, అందువల్ల పత్తి తేమ శాతం 12 నుంచి 20 శాతానికి సవరించి కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సీసీఐ నిబంధనలు వెంటనే సవరించాలని డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 2019-2020 ఏడాదికి 49.56 లక్షల పత్తి బేళ్లను కాటన్ కార్పొరేషన్ నిల్వ చేయడగా అందులో 9.28 లక్షల బేళ్లను మాత్రమే తరలించారన్నారు.