రెండు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇండియన్ స్టాంప్ బిల్లు, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు, జీహెఎంసీ సవరణ బిల్లు, క్రిమిన్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. కేవలం చట్ట సవరణ కోసమే సమావేశాలు నిర్వహిస్తున్నందును ప్రశ్నోత్తరాలను నిలిపివేశారు. కాగా.. ఈ సమావేశాలకు కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క మాత్రమే హాజరయ్యారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు.