ఒక్క ట్వీట్ తో బాలీవుడ్ హీరోల పరువు తీసిన ఆర్జీవీ..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య బాలీవుడ్లో మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు కొన్ని మీడియా సంస్థలు బాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ పలు కథనాలు ప్రచురితం చేశాయి. Also Read: అర్హ కోసం దిండుగా మారిన అయాన్! ప్రధానంగా రిప్లబ్లిక్ టీవీ.. టై నౌ ఛానల్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులను […]

Written By: NARESH, Updated On : October 13, 2020 12:30 pm
Follow us on

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య బాలీవుడ్లో మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు కొన్ని మీడియా సంస్థలు బాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ పలు కథనాలు ప్రచురితం చేశాయి.

Also Read: అర్హ కోసం దిండుగా మారిన అయాన్!

ప్రధానంగా రిప్లబ్లిక్ టీవీ.. టై నౌ ఛానల్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులను టార్గెట్ చేస్తూ కొన్నినెలలుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ ఛానల్ రిపోర్టర్ అర్నబ్ గోస్వామి బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మినిటూ మినిట్ లైవ్ డిబేట్స్ పెట్టి బాలీవుడ్లోని సెలబ్రెటీలను కడిగిపారేశాడు.

సుశాంత్ కేసుతో సంచలనం సృష్టిద్దామనుకున్న అర్నాబ్ కు ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టు షాకిచ్చింది. సుశాంత్ ది ఆత్మహత్యేనని ఢిల్లీ వైద్యబృందం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మౌనం దాల్చిన బాలీవుడ్ సెలబ్రెటీలు తమ ప్రతిష్ఠను రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ సంస్థలు దిగజార్చాయంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అమీర్ ఖాన్.. అజయ్ దేవగణ్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. కరణ్ జోహర్.. ఆదిత్య చోప్రాకు చెందిన సంస్థలతో మొత్తంగా 38 సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీరంతా మూకుమ్మడిగా కోర్టులో కేసులు వేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉండి తాజాగా ఫిర్యాదు చేయడంతో నెటిజన్లు ‘బాయ్ కాట్ బాలీవుడ్’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Also Read: నాని ప్లాప్స్ కు కారణం అదేనట !

దీనిపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించాడు. గతంలోనూ అర్నబ్ గోస్వామిని.. బాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేసిన ఆర్జీవీ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అర్నబ్‌పై బాలీవుడ్ రియాక్షన్ చాలా ఆలస్యమైందని.. బాలీవుడ్ హీరోలంతా ఢిల్లీ హైకోర్టు ముందుకు వెళ్లి స్కూల్ పిల్లల్లా టీచర్ వద్ద మొరపెట్టుకుంటున్నట్టు ఉందంటూ ఎద్దేవా చేశాడు.

టీచర్ టీచర్ అర్నబ్ మమ్మల్ని తిడుతున్నాడు అంటూ చెప్పినట్టు ఉందని బాలీవుడ్ స్టార్ హీరోలను ఉద్దేశించి ఆర్జీవీ వ్యాఖ్యనించారు. ఒకే ఒక్క ట్వీట్ తో బాలీవుడ్ స్టార్ హీరోల పరువు మొత్తం ఆర్జీవీ తీసేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.