మహబూబాబాద్లో జరిగిన బాలుడు దీక్షిత్ హత్య కేసులో నిందితులు సంచలన విషయాలు బయటపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన వాయిస్ గుర్తుపట్టకుండా డింగ్టాక్ వాయిస్ ఓవర్, ఇంటర్నెట్ ప్రొటోకాల్ యాప్ వాడినట్లు నిందితుడు మందసాగర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెట్రోల్ బంక్కు వెళ్దామని చెప్పి దీక్షిత్ను తీసుకెళ్లామని, నీళ్లలో నిద్రమాత్రలు వేసి తాగించామన్నారు. నిద్రలోకి జారుకున్నాక గొంతునులిమి హత్య చేసి తగలబెట్టినట్లు వారు పేర్కొన్నారు.