మరో రెండు రోజులోల్లో రాజశేఖర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని జీవిత గురువారం తెలిపారు. గత కొద్దిరోజులుగా ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయనకు ప్లాస్మా అందించడంతో ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. కరోనా వైరస్ వల్ల శరీరంలో కలిగిన ఇన్ఫెక్షన్ తగ్గింది. పలు పరీక్షల అనంతరం ఆయనను ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేయనున్నారని తెలిపింది.