కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్కి సోమవారం అర్ధరాత్రి ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మంగళవారం ఉదయం ముళ్ల పొదల్లో ప్రణయ్ మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని జమ్మికుంట రూరల్, టౌన్ సీఐలు రాములు, సృజన్రెడ్డి, వీణవంక ఎస్ఐ కిరణ్రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రణయ్ ఇదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడని, అ వ్యవహారమే హత్యకు కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.