ధరణి వెబ్సైట్లో ఆస్తుల నమోదుకు ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని తెంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ధరణిలో ఆస్తుల నమోదుపై దాఖలైన వివిధ పిటిషన్లపై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ధరణి పేరిట ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించింది. డేటా దుర్వినియోగం అయితే భద్రతకు విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వ అడ్వకేట్ సమాధానమిస్తూ డేటా భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాగా కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు.