భార్య, పిల్లలతో సహా రైలుకిందపడి ఆత్మహత్య

కర్నూులు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నంద్యాల మండలంలోని రోజా కుంట ప్రాంతానికి చెందిన గఫార్‌ కుటుంబసభ్యుతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం గఫార్‌ తన భార్య, ఇద్దరు  పిల్లలతో కలిసి ఆటోలో నంద్యాల నుంచి ప్రాణ్యం మండలం కౌలూరు వద్దకు వచ్చాడు. ఆ తరువాత గూడ్స్ రైలు రాగానే ఆ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి […]

Written By: Suresh, Updated On : November 3, 2020 2:41 pm
Follow us on

కర్నూులు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నంద్యాల మండలంలోని రోజా కుంట ప్రాంతానికి చెందిన గఫార్‌ కుటుంబసభ్యుతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం గఫార్‌ తన భార్య, ఇద్దరు  పిల్లలతో కలిసి ఆటోలో నంద్యాల నుంచి ప్రాణ్యం మండలం కౌలూరు వద్దకు వచ్చాడు. ఆ తరువాత గూడ్స్ రైలు రాగానే ఆ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. గఫార్‌ గతంలో ఓ బంగారం దుకాణంలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. కాగా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంపై రోజాకుంట ప్రాంతంలో విషాదం నెకొంది.