చేతులు కట్టేసుకొని ప్రేమజంట ఆత్మహత్య

తమ చేతులను కట్టేసుకొని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వరంగల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మన్నే సాయి, మెదక్ జిల్లాకు చెందిన అశ్విని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఢిల్లీలో చుదువుతున్న సాయి కరోనా నేపథ్యంలో ఇంటి వద్దకు వచ్చాడు. అయితే నక్కలపెల్లి శివారులోని బావి వద్ద ద్విచక్రవాహనం, చెప్పులను స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టగా రెండు మ్రుతదేహాలు లభ్యమయ్యాయి. వారిని […]

Written By: Suresh, Updated On : December 18, 2020 4:07 pm
Follow us on

తమ చేతులను కట్టేసుకొని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వరంగల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మన్నే సాయి, మెదక్ జిల్లాకు చెందిన అశ్విని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఢిల్లీలో చుదువుతున్న సాయి కరోనా నేపథ్యంలో ఇంటి వద్దకు వచ్చాడు. అయితే నక్కలపెల్లి శివారులోని బావి వద్ద ద్విచక్రవాహనం, చెప్పులను స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టగా రెండు మ్రుతదేహాలు లభ్యమయ్యాయి. వారిని సాయికుమార్, అశ్వినిగా గుర్తించారు.