
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ… పండుగను చేసుకుందామని సూచించారు. ఈ ప్రపంచాన్ని మరింత సంపన్నంగా, శాంతియుతంగా మార్చుకునేందుకు తీర్మానించుకుందామని గవర్నర్ పిలుపునిచ్చారు. అందరికీ అవధుల్లేని సంతోషం, ప్రశాంతత క్రిస్మస్ పండుగ తీసుకురావాలని తమిళిసై ఆకాంక్షించారు. ప్రేమ, క్షమించే గుణం, నిజాయితీ, కరుణ, సోదరభావం, త్యాగాలకు జీసస్ జీవితం ప్రతీక అని వివరించారు. జీసస్ జన్మదినాన్ని జరుపుకునేందుకు ఇదో మంచి రోజని గవర్నర్ పేర్కొన్నారు.