GHMC Counting:ఖాతా తెరిచిన కాంగ్రెస్: టీఆర్ఎస్-2, ఎంఐఎం-3 స్థానాల్లో విజయం

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరధిలోని ఏ ఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ యూసుఫ్ గూడ(రాజ్ కుమార్ పటేల్), మెట్టు గూడ (సునీత) లో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఎంఐఎం మోహిది పట్నం, డబీర్ పూర్ , అహ్మద్ నగర్లో గెలుపొందింది. అడిక్మేట్, గాంధీనగర్, జడీమెట్ల, కొండాపూర్, గచ్చబౌలి,గోల్నాకలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా ఇప్పటి […]

Written By: Suresh, Updated On : December 4, 2020 1:31 pm
Follow us on

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరధిలోని ఏ ఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ యూసుఫ్ గూడ(రాజ్ కుమార్ పటేల్), మెట్టు గూడ (సునీత) లో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఎంఐఎం మోహిది పట్నం, డబీర్ పూర్ , అహ్మద్ నగర్లో గెలుపొందింది. అడిక్మేట్, గాంధీనగర్, జడీమెట్ల, కొండాపూర్, గచ్చబౌలి,గోల్నాకలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా ఇప్పటి వరకు 57 స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ 23, ఎంఐఎం 30, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.