సమర్థవంతంగా బాలల హక్కుల పరిరక్షణ : మంత్రి సత్యవతి

బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, బాలల హక్కులను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ పరిధిలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలన్నారు. తెలిసి, తెలియని వయసు నుంచే బాలబాలికల పట్ల అనేక దురాఘతాలు జరుగుతున్నాయన్నారు.

Written By: Suresh, Updated On : January 7, 2021 4:39 pm
Follow us on

బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, బాలల హక్కులను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ పరిధిలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలన్నారు. తెలిసి, తెలియని వయసు నుంచే బాలబాలికల పట్ల అనేక దురాఘతాలు జరుగుతున్నాయన్నారు.