సంక్షేమ డిగ్రీ కళాశాలలో 75 మందికి పాజిటివ్

కరోనా వైరస్ విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే ఎందరో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 67 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది. అయితే పాజిటివ్ వచ్చిన వారిని కళాశాలలోనే క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు […]

Written By: Suresh, Updated On : November 29, 2020 9:38 am
Follow us on

కరోనా వైరస్ విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే ఎందరో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 67 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది. అయితే పాజిటివ్ వచ్చిన వారిని కళాశాలలోనే క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందులో చికిత్స ఇస్తున్నారు. నెగెటివ్ వచ్చిన విద్యార్థులకు ఇంటికి పంపించేశారు. అయితే పాజిటివ్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.