ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐడీబాంబు పేలీ ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని రాయ్పూర్ ప్రాంతంలోని చింతల్ నూర్ అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి పేలిన బాంబులో మహారాష్ట్రకు చెందిన నితిన్ భలేరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ఆదివారం మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 9 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సీఆర్పీఎప్, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మావోయిస్టులు అమర్చిని బాంబు పేలిందన్నారు.