రఘునందన్‌రావు కేంద్రం నుంచి చిల్లి గవ్వ తేలేడు: రేవంత్‌రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కేంద్రం నుంచి చిల్లి గవ్వ తేలేడని ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పగలు కొట్టుకుంటారు.. రాత్రి కలుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బంద్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్..ఈరోజు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్న ఆధారాలు ఉన్నాయని వాటిని కేంద్రానికి కావాలంటే అందజేస్తామన్నారు. అడ్డుకునే […]

Written By: Suresh, Updated On : January 1, 2021 7:11 pm
Follow us on

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కేంద్రం నుంచి చిల్లి గవ్వ తేలేడని ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పగలు కొట్టుకుంటారు.. రాత్రి కలుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బంద్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్..ఈరోజు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్న ఆధారాలు ఉన్నాయని వాటిని కేంద్రానికి కావాలంటే అందజేస్తామన్నారు. అడ్డుకునే దమ్ము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ కుమార్‌కి ఉందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.