సూర్యపేట జిల్లాలో బాలుడి కిడ్నాప్

  గత రెండు నెలలుగా తెలంగాణలో మిస్సింగ్ కేసులు అధికమవుతున్నాయని సైబరాబాద్ పోలీసులు గణాంకాలను వెబ్ సైట్ లో ఉంచారు. ప్రస్తుతం మిస్సింగ్ కేసులపై ఎక్కువగా దృష్టి సారించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే మిస్సింగ్ కేసులు మాత్రం ఆగడం లేదు. తాజాగా సూర్యపేట జిల్లాలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ కు చెందిన పి. మహేశ్ కుమారుడు ఐదేళ్ల గౌతమ్ శనివారం రాత్రి అదృశ్యమయ్యాడు. దీంతో ఆదివారం ఉదయం […]

Written By: Suresh, Updated On : November 15, 2020 12:57 pm
Follow us on

 

గత రెండు నెలలుగా తెలంగాణలో మిస్సింగ్ కేసులు అధికమవుతున్నాయని సైబరాబాద్ పోలీసులు గణాంకాలను వెబ్ సైట్ లో ఉంచారు. ప్రస్తుతం మిస్సింగ్ కేసులపై ఎక్కువగా దృష్టి సారించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే మిస్సింగ్ కేసులు మాత్రం ఆగడం లేదు. తాజాగా సూర్యపేట జిల్లాలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ కు చెందిన పి. మహేశ్ కుమారుడు ఐదేళ్ల గౌతమ్ శనివారం రాత్రి అదృశ్యమయ్యాడు. దీంతో ఆదివారం ఉదయం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గతంలో వరంగల్ జిల్లాలో బాలుడి అదృశ్యం, హత్య కేసు మరువకముందే సూర్యపేట జిల్లాలో బాలుడు కిడ్నాప్ నకు గురికావడం కలకలం రేపుతోంది.