
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ చాన్సలర్ ( వీసీ ) పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. బుధవారం టూరిజం ప్లాజాలో ఎక్సెల్ ఇండియా, ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ‘హయ్యర్ ఎడ్యుకేషన్ – పోస్ట్ కొవిడ్ ఎరా’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వీసీల భర్తీ ప్రక్రియను నెల రోజుల కాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు వివిధ యూనివర్సిటీల్లో 1,061 టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు.