తెలంగాణలో కొత్తగా 474 కరోనా కేసులు
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా స్ట్రేయిన్ కలకలం రేపుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 474 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,85,93గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,538గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,78,523 మంది కోలుకోగా ప్రస్తుతం 5,878యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 3,735 మంది ఇంట్లో చికిత్స […]
Written By:
, Updated On : December 30, 2020 / 12:45 PM IST

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా స్ట్రేయిన్ కలకలం రేపుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 474 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,85,93గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,538గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,78,523 మంది కోలుకోగా ప్రస్తుతం 5,878యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 3,735 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 24 గంటల్లో 45,590 పరీక్షలు నిర్వహించారు.