China latest technology innovations: తయారీ రంగంలో ఇప్పటికే చైనా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా వేగంగా పరుగులు పెడుతోంది. అమెరికాను ఇప్పటికే మించిపోయింది. జపాన్ దేశాన్ని కూడా దాటిపోయింది. చివరికి రోబోలతో పరుగుల పోటీపెడుతోంది. నిర్మాణరంగంలో రోబోలతో పని చేయిస్తోంది. ఇటీవల ఒక రైల్వే స్టేషన్ నిర్మాణంలో రోబోలతో పని చేయించి సరికొత్త చరిత్ర సృష్టించింది చైనా.
చైనా ఇంతటితోనే ఆగిపోవడం లేదు. సాంకేతిక ఉత్పత్తుల తయారీలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.. మన నిత్య జీవితంలో వాడే సెల్ ఫోన్లు.. లాప్టాప్ లు.. వ్యక్తిగత కంప్యూటర్ల విషయంలో చైనా సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఆ ఉత్పత్తులు కేవలం చేతి సైగల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి.
ఇక లాప్టాప్ లు అయితే జస్ట్ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అంతే కాదు టర్బో చార్జర్ ద్వారా అది వెంటనే చార్జింగ్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ లు అయితే అత్యంత వేగంగా పని చేస్తున్నాయి. చార్జింగ్ నుంచి మొదలుపెడితే నెట్ సర్పింగ్ వరకు అన్ని విభాగాలలో సూపర్ పనితీరు కనబరుస్తున్నాయి. చైనా ఈ స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది కాబట్టే ఆపిల్ కంపెనీ తన ఉత్పత్తులను అమెరికాలో కాకుండా డ్రాగన్ దేశంలో అసెంబ్లింగ్ చేయిస్తోంది.
స్మార్ట్ ఫోన్ ల మార్కెట్ లో ఒకప్పుడు అమెరికా, దక్షిణకొరియా, ఫిన్ లాండ్ దేశాల హవా ఉండేది. ఆర్ అండ్ డీ మీద చైనా విపరీతంగా ఫోకస్ చేయడంతో ఉత్పత్తి పెరిగిపోయింది. ఫీచర్లు, అనేక రకాల సౌలభ్యాలు అందుబాటులోకి రావడంతో చైనా కంపెనీలు ప్రపంచ మార్కెట్ ను దున్నేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో సింహభాగానికి మించిన వాటా చైనా కంపెనీలదంటే పరిస్థితి ెలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భవిష్యత్ కాలాన్ని ముందే ఊహించి ఉత్పత్తులు తయారు చేయడం చైనాకు మొదటి నుంచి అలవాటే. ప్రపంచం మొత్తం ఐదో తరం టెక్నాలజీ వాడుతుంటే.. చైనా కంపెనీలు ఏడోతరం ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వీటిని అత్యంత ఆధునికంగా రూపొందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ల నుంచి మొదలు పెడితే లాప్టాప్ ల వరకు చైనా కంపెనీలు ఇలా ఉత్పత్తులను తయారు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ మొత్తాన్ని శాసించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
