spot_img
HomeజాతీయంAndroid users : ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. కేంద్రం తాజా హెచ్చరికలివి

Android users : ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. కేంద్రం తాజా హెచ్చరికలివి

Android users : అర చేతిలో స్మార్ట్ ఫోన్. మనలో చాలామందికి ఆపిల్ ఫోన్లు కొనే స్తోమత ఉండదు కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ లనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆండ్రాయిడ్ అనేది తక్కువ ఖర్చులో లభించే ఆపరేటింగ్ సిస్టం కాబట్టి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పైగా ఆండ్రాయిడ్ యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది..

ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లు వాడే వినియోగదారులకు కేంద్రానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ అటాకర్లు సులువుగా దాడి చేసి విలువైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వెర్షన్స్ 11,12,12L,13,14 లకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. దీనికి పరిష్కారంగా కంపెనీ నుంచి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఒక నివేదిక ప్రకారం ఐవోఎస్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లను సైబర్ ఎటాకర్లు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. విలువైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. చాలామంది ఫోన్లలో డీజిటల్ బ్యాంకింగ్ ను వాడుతుండడంతో అందులో ఉన్న నగదును మొత్తం దోచుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఫోన్లు వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యూజర్ ఫ్రెండ్లీ కావడంతో ఏవి పడితే అవి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరించింది. అలా చేస్తే ఫోన్ లో ఉన్న వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందని.. విలువైన సమాచారం మొత్తం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందని వివరించింది.

ఓ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయి. హ్యాకర్లు అత్యంత తెలివిగా స్మార్ట్ ఫోన్ లోకి ప్రవేశించి దర్జాగా దోచుకుంటున్నారు. ఒకవేళ ఖాతాలో సరైన స్థాయిలో నగదు లేకుంటే ఫోటోలు లేదా వీడియోలను అశ్లీల సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని తొలగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే డబ్బులతోపాటు రకరకాల వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో యూజర్లను జాగ్రత్తపరిచేందుకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది. ఫోన్లో వాడే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని.. అడ్డగోలుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదని పేర్కొన్నది. ఓ సర్వే నివేదిక ప్రకారం మనదేశంలో ఆండ్రాయిడ్ యూజర్లు సైబర్ దాడుల వల్ల వందల కోట్ల విలువైన సొమ్మును కోల్పోతున్నారు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Oktelugu Epaper