Tata IPL 2022: ఐపీఎల్ మ్యాచుల జోరు కొనసాగుతోంది. విజయం కోసం జట్లు చివరి బంతి వరకు పోరాడుతున్నాయి. దీంతో ప్రేక్షకులకు కనువిందు అవుతోంది. స్టార్ ఆటగాళ్ల ఆట ఇంకా చూడటం లేదు. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తమ అభిమాన తారలు సందడి చేస్తుంటే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముంబై, పంజాబ్, ఆర్బీసీ జట్లలోని ఆటగాళ్ల ఆటను ఆస్వాదించాలని ప్రేక్షకులు తాపత్రయపడుతున్నారు. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్, కింగ్స్ అభిమానులు తమ ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
ముంబై ఇండియన్స్ లో చేరిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా జట్టులో చేరలేదు. దీంతో అతడి ఆటను అభిమానులు మిస్సవుతున్నారు. దీంతో అతడు జట్టులోకి వచ్చి తన ఫామ్ కొనసాగించాలని ఆశిస్తున్నారు. ఏప్రిల్ లో రాజస్తాన్ తో ఆడే మ్యాచ్ కు సూర్యకుమార్ అందుబాటులో ఉండవచ్చని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అతడి బ్యాటింగ్ విన్యాసాలు కనులారా చూడాలని తాపత్రయపడుతున్నారు.
రాయల్ చాలెంజర్స్ లో ఆల్ రౌండర్ గ్లెయిన్ మాక్స్ వెల్ కూడా ఇప్పటి వరకు జట్టులో చేరలేదు. దీంతో అతడి కోసం కూడా అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఆర్బీఐ ఆడబోయే తరువాత మ్యాచ్ ఏప్రిల్ 5న ఆడనుండటంతో అతడు అందుబాటులో వచ్చే అవకాశముందని తెలుస్తోంది. తమ హీరోలైన ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూసి ఆనందపడేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ కింగ్స్ ఆటగాడు జానీ బెయిర్ స్టో కూడా మూడు రోజులు క్వారంటైన్ లో ఉండనున్నాడు. పంజాబ్ కోల్ కత నైట్ రైడర్స్ తో ఆడే మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో ఉండటంతో బెయిర్ స్టో ఐపీఎల్ లో చేరడానికి ఆలస్యమైనట్లు చెబుతున్నారు. మొత్తానికి స్టార్ ఆటగాళ్ల కోసం అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆటలో కనువిందైన షాట్లు ఆడే వారి కోసం ఎప్పుడు ఎదురు చూడటం అలవాటే.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More