spot_img
Homeక్రీడలుక్రికెట్‌WPL 2025 Auction Highlights: WPL మినీ వేలం.. ఈ 16 సంవత్సరాల అమ్మాయి నక్కతోక...

WPL 2025 Auction Highlights: WPL మినీ వేలం.. ఈ 16 సంవత్సరాల అమ్మాయి నక్కతోక తొక్కింది.. అంతేసి ధర పలికింది..

WPL 2025 Auction Highlights: భారత జట్టులో అనామక ( అన్ క్యాప్డ్) మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ మినీ వేలంలో అదరగొట్టింది. నక్కతోక తొక్కినట్టుగా అత్యధిక ధర సొంతం చేసుకుంది. సిమ్రాన్ ను గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా 1.90 కోట్లను ఆమెకు చెల్లించింది. ఆమె వాస్తవ ధర 10 లక్షలు కాగా.. తమ జట్టులోకి తీసుకోవడానికి ఢిల్లీ, గుజరాత్ యాజమాన్యాలు తీవ్రంగా ప్రయత్నించాయి. చివరికి గుజరాత్ యాజమాన్యానికి ఆ అదృష్టం దక్కింది. వెస్టిండీస్ చెట్లు కీలకమైన ఆల్ రౌండర్ గా ఉన్న డియాండ్రా డాటిన్ 50 లక్షల కనీస ధరతో ఆమె వేలంలోకి వచ్చింది. ఆమె కోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ జట్ల యాజమాన్యాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. చివరికి గుజరాత్ యాజమాన్యం ఆమెను 1.70 కోట్లకు దక్కించుకుంది. టీమిండియాలో కీలకమైన వికెట్ కీపర్ గా కొనసాగుతున్న 16 సంవత్సరాల కమలిని ని ముంబై జట్టు కొనుగోలు చేసింది. ఆమె కోసం ఏకంగా 1.60 కోట్లు చెల్లించింది. మరో కీలకమైన ప్లేయర్ ప్రేమ రావత్ ను బెంగళూరు జట్టు వన్ పాయింట్ 1.20 కోట్లకు దక్కించుకుంది.

వేలంలో అత్యధిక ధర దక్కింది ఈ ప్లేయర్లకే.

సిమ్రాన్ షేక్.. గుజరాత్ జట్టు ఈమెను 1.90 కోట్లకు కొనుగోలు చేసింది.

డియాండ్రా డాటిన్.. ఈ విండీస్ ప్లేయర్ ను గుజరాత్ జట్టు 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.

కమలిని.. ఈమెను 1.60 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.

ప్రేమ రావత్.. ఈమెను 1.20 కోట్లకు బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.

చరణి.. ఈమెను ఢిల్లీ జట్టు 55 లక్షలకు కొనుగోలు చేసింది.

నాడిన్ డి క్లర్క్.. ఈమెను ముంబై జట్టు 30 లక్షలకు కొనుగోలు చేసింది.

డేనియల్ గిబ్సన్.. ఈమెను 30 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది.

అలనా కింగ్.. ఈమెను 30 లక్షలకు ఉత్తరప్రదేశ్ జట్టు కొనుగోలు చేసింది.

అక్షిత.. ఈమెను 20 లక్షలకు ముంబై జట్టు కొనుగోలు చేసింది.

నందిని.. ఈమెను ఢిల్లీ జట్టు 10 లక్షలకు కొనుగోలు చేసింది.

సారా .. ఈమెను పదిలక్షలకు ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.

జోషిత.. ఈమెను బెంగళూరు 10 లక్షలకు కొనుగోలు చేసింది.

సంస్కృతి.. ఈమెను ముంబై జట్టు పది లక్షలకు కొనుగోలు చేసింది.

క్రాంతి గౌడ్.. ఈమెను ఉత్తరప్రదేశ్ జట్టు పది లక్షలకు కొనుగోలు చేసింది.

అరుషి గోయల్.. ఏమను 10 లక్షలకు ఉత్తరప్రదేశ్ జట్టు కొనుగోలు చేసింది.

ప్రకాశికా నాయక్.. ఈమెను 10 లక్షలకు గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది.

నికి ప్రసాద్.. ఈమెను పదిలక్షలకు ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది.

జాగ్రవి పవార్.. ఈమెను పదిలక్షలకు బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.

రాఘవి.. ఈమెను 10 లక్షలకు బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.

అమ్ముడుపోని ప్లేయర్లు వీళ్లే

కిమ్ గార్త్, సారా గ్లెన్, లారెన్ బెల్, లిజల్ లీ, హీథర్ నైట్ వంటి విదేశీ ప్లేయర్లు అమ్ముడుపోలేదు.. పూనమ్ యాదవ్, సుష్మ వర్మ, స్నేహ్ రాణా, సుష్మా వర్మ వంటి స్వదేశీ ప్లేయర్లను ఏ జట్టు యాజమాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Oktelugu Epaper