Homeక్రీడలుBCCI: స్టార్ ఆటగాళ్లకు కష్టమేనా.. బీసీసీఐ ఇంత పని చేసిందేంటి?

BCCI: స్టార్ ఆటగాళ్లకు కష్టమేనా.. బీసీసీఐ ఇంత పని చేసిందేంటి?

BCCI: కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్ ఇవ్వనుందా? ఐపీఎల్ లో కొత్త నిబంధనను తెరపైకి తీసుకురానుందా? దీంతో వారు వేలం నుంచి బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తోందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతోంది జాతీయ మీడియా. ఆ అంశాలకు సంబంధించి జాతీయ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ కు సంబంధించి ఈ సంవత్సరం చివరిలో మెగా వేలం జరగనుంది.. ఈ వేలంలో జట్లను అట్టి పెట్టుకున్న(రి టైన్) ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ఆయా యాజమాన్యాల నుంచి ఒక సలహా కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకు అహ్మదాబాదులో నిర్వహించే బోర్డు సమావేశానికి మొత్తం 10 జట్ల యాజమాన్యాలకు బీసీసీఐ ఆహ్వానాలు కూడా పంపింది.

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది.బీసీసీఐ అంచనా వేసిన దాని కంటే 17వ సీజన్ అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు రసవత్తరమైన క్రికెట్ మజాను అందిస్తోంది. ఈ క్రమంలో ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసి.. వచ్చే సీజన్ లో డిమాండ్ ను అమాంతం పెంచుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. ప్రస్తుతం 17వ సీజన్ త్వరలో ముగియబోతున్న నేపథ్యంలో ఏడాది చివరిలో ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహిస్తారు. ఈ వేళంలో ప్రతి జట్టు స్వరూపం పూర్తిగా మారుతుంది. అంతేకాదు కీలక ఆటగాళ్లు మెగా వేలంలో కనిపించరు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

జాతీయ మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆయా జట్లను అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నిర్ణయం ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో.. బీసీసీఐ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది త్వరలోనే తేలనుంది. ఐపీఎల్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అయితే చాలావరకు జట్ల యాజమాన్యాలు వేలానికి ముందు ఎనిమిది మంది కీలకమైన ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునేందుకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.బీసీసీఐ తీసుకొనే నిర్ణయం పట్ల స్టార్ ఆటగాళ్లు సుముఖంగా ఉంటారా? లేకుంటే వ్యతిరేకిస్తారా? ఈ నిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చిన బీసీసీఐ.. యాజమాన్యాలు కాకుండా ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. వీటిపై బీసీసీఐ వర్గాలు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అహ్మదాబాద్ లో జరిగే బీసీసీఐ బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version