Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer replaces Suryakumar Yadav: సూర్యను పక్కనపెట్టి.. అయ్యర్ కు కెప్టెన్సీ అప్పగించింది అందుకే..

Shreyas Iyer replaces Suryakumar Yadav: సూర్యను పక్కనపెట్టి.. అయ్యర్ కు కెప్టెన్సీ అప్పగించింది అందుకే..

Shreyas Iyer replaces Suryakumar Yadav: వన్డే, టెస్ట్ మాత్రమే కాదు.. టి20 ఫార్మాట్లో కూడా గౌతమ్ గంభీర్ ప్రయోగాలు మొదలుపెట్టాడు. టీమ్ ఇండియాకు పొట్టి ఫార్మాట్ లో తిరుగులేదు. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 2024 నుంచి ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. పైగా వరుసగా 2026 లో కూడా t20 వరల్డ్ కప్ గెలిచింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ అందుకుంది. అంతకుముందు అంటే 2007లో ధోని నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సాధించింది.

ఐపీఎల్ వల్ల కొత్త కొత్త ప్లేయర్లు అందుబాటులోకి వస్తున్నారు. వారంతా కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అందువల్లే పొట్టి ఫార్మాట్ లో కూడా ప్రయోగాలు చేసేందుకు గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లకు టీమిండియా ను ప్రకటించాడు.. ఇదే జట్టు ఏషియన్ గేమ్స్ లో కూడా ఆడుతుందని ప్రకటించాడు.. భారత జట్టుకు అయ్యర్ నాయకత్వం వహించబోతున్నాడు. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. యువ సంచలనం సూర్య వంశీకి జట్టులో చోటు లభించింది.. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. సంజు శాంసన్ ,అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, శివం దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్య వంశీ వంటి ప్లేయర్లకు ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ లో అవకాశం లభించింది. ఇక ఏషియన్ గేమ్స్ లో బుమ్రా కు చోటు లభించింది.

కొంతకాలంగా సూర్య ఆటగాడిగా తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు. జట్టు ను ముందుకు నడిపించడంలో అతడు విజయవంతమవుతున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగులు తీయలేకపోతున్నాడు. తాజాగా ఐపీఎల్లో కూడా అతడు అంతగా సత్తా చూపించలేకపోయాడు. అందువల్ల మేనేజ్మెంట్ అతడికి రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే ప్రస్తుతం టి20 జట్టులో విపరీతమైన పోటీ ఉంది. ఆ పోటీ ఎలా ఉంటుందో సూర్యకు తెలిసినప్పటికీ.. అతడు సరిగ్గా తన ఆటతీరును మెరుగుపరుచుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. రింకూ సింగ్ కూడా అలానే ఆడలేక పోవడంతో.. వీరి ముగ్గురిని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది.

అయ్యర్ కొంతకాలంగా స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు.. అతడికి టి20 లలో అంతగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఐపీఎల్ ద్వారా తాను ఏమిటో నిరూపించుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అతడు అదరగొట్టాడు. పక్కటెముకలు గాయం కారణంగా కొద్దిరోజులపాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. 2024లో అయ్యర్ నాయకత్వంలో కోల్కతా ఐపిఎల్ ఛాంపియన్గా ఆవిర్భవించింది.. ఆటగాడిగా ఏ స్థానంలోనైనా అయ్యర్ బ్యాటింగ్ చేయగలడు. అందువల్లే గౌతమ్ గంభీర్ అయ్యర్ వైపు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. వరుసగా మూడు సిరీస్ లకు నాయకుడిగా అయ్యర్ కు ప్రమోషన్ లభించిన నేపథ్యంలో ఇన్ని రోజులపాటు చూసిన ఎదురుచూపుకు ఫలితం లభించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular