Nikhat Zareen : ‘నిఖత్ జరీన్’.. పడిలేచిన కెరటం.. మూడు బంగారు పతకాల ఈ పసిడి బాక్సర్ ఎవరు? పోరాట కథేంటి?

Nikhat Zareen : తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అత్యున్నత శిఖరాలకు వెళ్లిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నిలిచింది. అయితే నిఖిత ఈ స్థితికి మాములుగా రాలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌పై ఒలింపిక్ విచారణ కోసం నిఖత్ చేసిన అభ్యర్థనతో ఈమె దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ క్రమంలోనే అసలు “నిఖత్ జరీన్ ఎవరు?” అని అందరూ ఆరాతీసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా […]

Written By: NARESH, Updated On : December 25, 2022 7:52 pm
Follow us on

Nikhat Zareen : తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అత్యున్నత శిఖరాలకు వెళ్లిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నిలిచింది. అయితే నిఖిత ఈ స్థితికి మాములుగా రాలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌పై ఒలింపిక్ విచారణ కోసం నిఖత్ చేసిన అభ్యర్థనతో ఈమె దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ క్రమంలోనే అసలు “నిఖత్ జరీన్ ఎవరు?” అని అందరూ ఆరాతీసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఆమె సొంత సీనియర్, ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ తో పోటీపడి వార్తల్లో నిలిచింది.

రెండు హెవీ వెయిట్ కేటగిరీలు..మూడు గోల్డ్ మెడల్స్.. ఇది నిఖత్ జరీన్ సాధించిన అపూర్వమైన ఘనత.. ఈ మూడేళ్లలోనే నిఖత్ ఎంతో కష్టపడి గెలిచింది. నిఖత్ ఎవరో ప్రపంచానికి తెలుసింది.. ప్రపంచ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ గా నిలిచి సత్తా చాటింది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నిఖిత బాక్సింగ్ లో అత్యున్నత స్థానానికి చేరింది. విశ్వవిజేతగా నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్స్ లో 52 కిలోల విభాగంలో థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ పై 5-0 తేడాతో చిత్తుగా ఓడించి ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్ లతో విరుచుకుపడింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పసిడి సాధించిన ఐదో బాక్సర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు మన దేశం నుంచి మేరీకోమ్, సరితాదేవి, జెన్సీ ఆర్ఎల్, లేఖ కేసీ మాత్రమే పసిడి పతకాన్ని సాధించారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖిత జరీన్ 52 కేజీల వెయిట్ విభాగంలో ఫైనల్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో తొలిసారిగా పాల్గొని ఈ ఘనత సాధించడం విశేషం. నిఖిత 14 సంవత్సరాల వయసులోనే జూనియర్ బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ టైటిల్ ను గెలుచుకుంది. అయితే సీనియర్ స్థాయిలో ఆమె మొదటి విజయం 2019లో ప్రతిష్టాత్మకమైన స్ట్రేంజెర్జా మెమోరియల్ లో చోటుచేసుకుంది.. ఇదే సంవత్సరం ఆసియా ఛాంపియన్ షిప్ లో కాంస్యం పతకం గెలుచుకుంది. ఇక్కడి నుంచి నిఖిత ప్రయాణం ఆగలేదు. ఇదే ఉత్సాహంతో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకోవాలని పట్టుబట్టింది.

– మేరీ కోమ్ వివాదం
2019లో నిఖిత ప్రపంచ ఛాంపియన్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. అప్పటికే మేరీ కోమ్ భారతీయ బాక్సింగ్ పై చెలాయిస్తున్న ఆధిపత్యంతో నిఖితకు గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే 2019లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లకు బాక్సర్లను ట్రయల్స్ కు పంపారు. అయితే ఇందులో మేరీ కోమ్ 51 కేజీల్లో నెంబర్ వన్ గా నిలిచారు. నిఖితతో పాటు మరో ఇద్దరు బాక్సర్లు కూడా పోటీ పడ్డారు. కానీ నిఖిత సెలెక్షన్ నిలిపివేశారు. అయితే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులు నిఖితను కాదని కావాలనే మేరీకోమ్ ను ఎంపిక చేశారని కొన్న వార్తలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఇది తప్పని నిఖిత డిమాండ్ చేసింది. కానీ ఫెడరేషన్ తో పాటు మేరీ కోమ్ కూడా పట్టించుకోలేదు. ఫలితంగా మేరీకోమ్ 2019లో ఛాంపియన్ షిప్ లో పాల్గొని కాంస్యం గెలుచుకుంది. ఈ సమయంలో బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ చేసిన ఓ ప్రకటన వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకాలు గెలిచిన ఆటగాళ్లు ఒలంపిక్స్ లోకి వెళ్లేందుకు నేరుగా క్వాలిఫై పొందుతారని అన్నారు. మేరీ కోమ్ సహా ఇతర బాక్సర్లను ట్రయల్స్ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. బీఎఫ్ఐ అధ్యక్షుడి ప్రకటన తో ఫెడరేషన్ విభేదించింది. ఇదే సమయంలో నిఖిత తన హక్కుల కోసం పోరాడింది. ట్రయల్స్ కు తనకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ కూడా రాశారు. దీనిపై మంత్రి స్పందించారు. మొత్తంగా బీఎఫ్ఐ డిసెంబర్ 2019లో ట్రయల్స్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఇందులో నిఖితను మేరీకోమ్ ఓడించింది. తన మీద తనకున్న నమ్మకం .. ఎక్కువ మంది దాన్ని అహంభావం గా తీసుకున్నాసరే నిఖత్ ఎక్కడా తగ్గలేదు.

మూడేళ్ల తరువాత నిఖిత ఇప్పుడు మరోసారి మేరీకోమ్ తో పోటీపడింది. రింగ్ లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే యువతకు వచ్చిన అవకాశం అని మేరీకోమ్ వైదొలగింది. దీంతో ఇప్పుడు నిఖితపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కిందట ఆమె చేసిన బాక్సింగ్ పోరాటంతో పాటు హక్కుల పోరాటాన్ని గెలిచే దారులు పడ్డాయి.

-జాతీయ బాక్సింగ్ చాపింయన్ షిప్ లో క్వార్టర్స్ కు నిఖత్
చాలా కాలంగా, నిఖత్ మేరీ కోమ్ నీడలో ఎదగలేకపోయింది. కానీ 2022 సంవత్సరం అంతా మారిపోయింది. నిఖత్ ఇప్పుడు జోరుమీదుంది. జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్స్ లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. గురువారం 50 కేజీల ప్రీక్వార్టర్స్ పోరులో ఈ ప్రపంచ ఛాంపియన్ 5-0 తేడాతో ఎవా వేనీ (మేఘాలయ)పై ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న నిఖత్ అదే దూకుడు కొనసాగిస్తూ రింగ్ లో చిరుతలా కదిలింది. ఆమె ధాటికి ప్రత్యర్థి తలవంచింది. దేశమంతా ఇప్పుడు నిఖిత ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తోంది. ఆటలోనే కాదు.. జీవితంలోనూ పోరాడి గెలిచిందని ప్రశంసిస్తున్నారు.

– ఈఎస్పీఎన్ 2022 స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిఖత్

ప్రఖ్యాత స్పోర్ట్స్ మాగజైన్ ఈఎస్.పీఎన్ నిఖత్ ను 2022 స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసింది. నిఖత్ ఈ సంవత్సరానికి ఆడిన విధానం.. ప్రతి ప్రధాన ఈవెంట్‌లో అజేయంగా కొనసాగడం.. ఏకగ్రీవ తీర్పుల ద్వారా మూడు టైటిళ్లను గెలుచుకోవడంతో ఆమెను ఈఎస్.పీఎన్ భారతదేశపు మహిళా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2022గా చేసింది.

ఇలా తెలంగాణలోని ఒక మారుమూల అమ్మాయి బాక్సింగ్ లో దిగ్గజాలను ఎదుర్కొని.. కేంద్రంతో పోరాడి.. ఫైట్ లో గెలిచి నిలిచి ఇప్పుడు సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటోంది.రింగ్ లోనే కాదు.. బయట పరిస్థితులపై కూడా నిఖత్ పోరాడిన తీరు అద్భుతమనే చెప్పాలి. తనంటే ఎవరికీ తెలీని స్థితి నుంచి ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగిన తీర్పు అందరికీ స్ఫూర్తినిస్తోంది.